Followers

Wednesday, July 31, 2019

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పిస్తున్నా

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పిస్తున్నా

ఈరోజు హైదరాబాద్ లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి గౌరవ మహేష్ దత్ ఎక్క గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ కుమ్రంభీము జిల్లాలోని నెలకొన్న విద్యాబోధకుల సమస్యలు (టి ఆర్ టి)ఎస్.జి.టి ఉపాధ్యాయులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి, రెన్యూవల్ కానీ
సి ఆర్ టీ ఉపాధ్యాయులను వెంటనే రెన్యూవల్ చేసి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పూర్తిగా  భర్తీ చేయాలని కళాశాలలలో సీట్లను పెంచాలని,అలాగే ఆదిలాబాద్ మరియు కుమ్రంభీము ఆసిఫాబాద్ జిల్లాలలో కుమ్రంభీము స్టడీ సర్కిల్ త్వరలో ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి గారికి వినతి పత్రాన్ని సమర్పిస్తున్నా ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు అందరి ఆత్మబందువు గౌరవ శ్రీ ఆత్రం.సక్కు గారు,తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మా.భోజ్జు గారు తదితరులు కలవడం జరిగింది పై సమస్యలను సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

Tuesday, July 30, 2019

అడవి గుండెలో ఆదివాసి || GONDWANA CHANNEL ||

అడవి గుండెలో ఆదివాసి

మాటలల్లి
పాటలల్లి
మాధుర్యమును వొల్కించిన
ఆదివాసీలే
ఆది కోకిలలని
ఎవ్వరికీ యాదికి లేదా..??

అడవి మట్టిలో
నెత్తురింకిన
గోండన్నల గోండి భాష నెత్తుటి సువాసనైనా
జాడలేకపాయే..
వాళ్ళు రాసుకున్న
కవిత్వపు కాగితాలే కాదు
వాళ్ళ భాషలు కూడా చచ్చిపోతున్నయ్..
వాళ్ళు పాడుకున్న పాటలకు
చప్పట్లు కొట్టే చేతులే కాదు
వాళ్ళ చరిత్ర వైపు చూసే
చూపులు కూడా చచ్చిపోతున్నయ్..!!

వాళ్ళ గుండె సడి
ఆగిపోతే
ఇంకా ఎన్ని వాయిద్యాలు మూగబోతాయో..
వాళ్ళ గుండె గాయాల అరుపుల్ని
మనం వినకపోతే
ఇంకా ఎన్ని కళలు అంతమౌతాయో..!!

అడవి గుండెలో
ఇంకా ఎన్ని జీవధ్వనుల్ని మూగబొమ్మంటారు..??
అడవి గుండెలో
ఇంకా ఎన్ని జీవరాశుల్ని సావమంటారు..??

                         ౼దొంతం చరణ్ రెడ్డి
                                  వింజమూరు
                              

Sunday, July 28, 2019

ఆదివాసీ ఉద్యమానికి అంతర్గత ప్రేరణ కావాలి ||Gondwana Channel||

ఆదివాసీ ఉద్యమానికి అంతర్గత ప్రేరణ కావాలి


  ప్రతికూల వాతావరణం వున్నప్పటికి డాక్టర్ బి అర్ అంబేద్కర్ ఎలా చరిత్ర సృష్టించాగలిగాడు  

  జీవితానికి అవరోధంగా నిలిచినరాళ్ళాను డాక్టర్ ఎపిజె అబ్దుల్ కాలం విజయ సోపానాలుగా ఎలా మార్చుకోగలిగాడు❓


వారి అంతర్గత శక్తి అంతరంగంలోని బావాలే వారికి  చోదకశక్తులై ప్రతి అటంకాన్ని అధిగమించేలా ప్రేరణనిచ్చాయి వారు గారేను చూశారేగాని రంద్రాన్నీ కాదు వైఫల్యాలను విజయంలో భాగంగా స్వీకరించి  తమ వత్తిళ్ళను అదుపు చేసుకున్నారు ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా మలుచుకున్నారు ఎలాంటి బాహ్యమైన ప్రేరణకన్న అంతర్గత ప్రేరణ ఎంతో మెరుగ్గాను వేగంగాను పనిచేస్తుంది.


  మనం ఉద్యమం చేయగలము అనుకుంటే మనమే చేయగలుతాము.

  ఉద్యమాన్నికి విజయనికి మీ వైఖరిని మార్చుకోవటమే తప్ప అంతకుమించి మరేమీకాదు.


  ఉద్యమాన్నికి తగిలే ప్రతి దెబ్బను ఒక రాయిగా స్వీకరించి దానే ఒక శిల్పింగా మార్చాలి.



  ఏడు సార్లు పట్టాసరే ఎనిమిదోసారి లేచినిలవండి జపాన్ సూక్తి.


  నిట్టనిలువు కొండలు ఎక్కటానికి మొదట నెమ్మదిగా ప్రారంభించవలసి ఉంటుంది.

  నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని మీ చుట్టువున్నా వారిపైన సానుకూల ప్రభావాన్ని ప్రసరించండి.


ఉద్యమాన్నికి ప్రేరణ
〰〰〰〰〰〰〰

  గేయం గోండ్వనా ప్రాంతానికి సంభందించిన వనరులు బొగ్గు సిమేంట్ బాక్సైట్ మొదలగు వాటిని  వివిధ కులలను ఎస్టిజాబితలో చేర్చడంతో ఆదివాసులకు జరిగే నష్టాన్ని ప్రతిభింబించే విధంగా ఉద్యమాన్నికి ఉద్యమాకారులలో ప్రేరణ కల్లించే విధంగా ఆదివాసీ రచయితలు కళాకారులు ఒక గేయం రచన చేయాలి ఆ గేయమే ఆదివాసీ ఉద్యమాన్నికి ప్రేరణ కావాలి.


క్విట్ గోండ్వనా ఉద్యమం
〰〰〰〰〰〰〰
ఆదివాసీ ఉద్యమం మరో క్రొత్త రూపం ధరించలంటే ఇటువంటి నినాదం తీసుకోరావసిన అవసరం ఎంతైనా ఉంది మన ఉధ్యోగాలు మన భూములు మన నిధులు ఎవరైతే ఎస్టీలలో చట్టబద్దత లేకుండా నిభందన ఆర్టికల్ 342లో అమోదం పొందకుండా దోచుకుంటున్నారో వారిపైన క్విట్ గోండ్వాన ఉధ్యమం చేపట్టాలి మా ప్రాంతాని వదిలి వేళ్ళాడి.

సహకార నిరాకరణ ఉధ్యమం
〰〰〰〰〰〰
ఇందులో భాగంగా ప్రభుత్వం సేవలను నిరాకరించాలి అవి పన్నులు ఎన్నికలు ప్రభుత్వం అందించే అన్ని సేవలను నిలుపుదలచేసే శక్తి ఉధ్యమ రూపంలో రావాలి.

 శాసనోల్లంఘనోధ్యమం 
〰〰〰〰〰〰
భారత రాజ్యంగంలో ఎన్నో అంశాలు ఆదివాసుల అభివృద్ధి అనుకుణంగా ఉన్న వాటిని అనుసరిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేయకపోవడం ఆదిమ లక్షణాలను పాటించకుండా వివిధ కులలను ఏస్టీలుగా గుర్తించడం ఆదివాసుల ఆత్మగౌరవానికి భంగం కల్లించే శాసనాలను దిక్కరిండం.

పీసా చట్టం 242(c)1 ప్రజల యొక్క ఆచారాలను సాంస్కృతిక ప్రత్యేకతను సామాజిక ఆస్తిని సాంప్రదాయికంగా తగవులు తీర్చుకునే విధానాలను (ప్రస్తుతం ఉండే చట్టాలకు వ్యతిరేకంగా కాకుండా )కాపాడేందుకు కొనసాగించేందుకు ప్రతి గ్రామసభకు అధికారాలు ఉన్నాయి ఇందులో ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం అనే అంశాన్ని శాసనోల్లంఘన చేయాలి ప్రభుత్వం చేసే శాసనాలలో ఎదైన అంశం ఆదివాసుల మనుగడకు వ్యతిరేకంగా ఉంటే ఆ అంశాన్ని ధిక్కరించాలి.



 గోండ్వాన  ప్రాంతానికి  పార్టీ
〰〰〰〰〰〰
ఆదివాసుల ఆశయాలు లక్ష్యాలను ముందుకు సాగించలంటే ఆదివాసులకు ఒక స్వంత పార్టీ కావాలి ఇందుకోసం ఆదివాసీ మేదవులు ఉధ్యోగులు కవులు రచయితలు ముందుకు రావాలి మన ప్రాంతాల ఆశయాలకు అనుకుణంగా ఒక పార్టీ నిర్మాణం జరిగాలి ఆదివాసీ సోదరులు ఈ పార్టీనుండి పోటిచేసి విజయం ద్వారా మన డిమాండ్లను మన ఆశయాల్నీ ప్రభుత్వానికి తెలియాచేయాలి.

🏹🏹🏹🏹🏹🏹

 -ఆదివాసీ సంక్షేమ పరిషత్ 
ఉమ్మడి అదిలాబాద్ శాఖ.

Saturday, July 27, 2019

కడదశలో కొలాంలు || Gondwana channel ||

కడదశలో కొలాంలు

    అత్యంత ప్రాథమిక  ఆదివాసీ తెగ  అయిన  కొలాంల గురించి తెలిసిన వారు మైదాన ప్రాంతాల్లో చాలా తక్కువ. గోండులే అత్యంత  వెనుకబడిన ఆదివాసీ జాతిగా అందరికీ తెలుసు. అటువంటి గోండులకంటే కూడా చాలా వెనుకబడి, వారి జాతి పేరు కూడా ఇతర ప్రపంచానికి పెద్దగా తెలియని, మనుగడే ప్రశ్నార్థకంగా మారిన మానవ జాతి ఒకటుంది. అదే కొలామ్ తెగ.
     ఇటీవల నార్నూర్ మండలం కొత్తపల్లి కొలాం గూడలో ఒక పెళ్లి విందులో కలుషిత నీరు తాగి 25 మంది అతిసారకు గురై గంటల వ్యవధిలో ముగ్గురు పిల్లలు మరణించారు. పది రోజుల తేడాతో హర్కాపూర్లో గ్రామంలో మరో కొలాం గర్భిణీ రక్తహీనతతో మరణించింది. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొలాం గోంధి గ్రామంలో  పోడు కోసం చెట్లు కొట్టారని అధికారులు,శాసనకర్తలు, న్యాయమూర్తులంతా కలిసి 16 కొలాం కుటుంబాలను శరణార్థుల కంటే హీనంగా మార్చిన సందర్భం చూశాం.  ఇవి కొలాంల ధైన్యాన్ని బట్టబయలు చేసిన ఘటనలు.
           తెలంగాణలో కొలాంలు ఉమ్మడి  అదిలాబాద్ జిల్లాలో మాత్రమే ఉన్నారు. అన్ని ఆదివాసీ జాతుల్లోకెల్లా కొలాంలది దుర్భర స్థితి.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 కి పైగా కొలాం  ఆవాసాలున్నాయి. సగటున అవాసానికి 120 మంది ఉంటారు. ఆవాసాలు ఎక్కువగా అత్యంత లోతట్టు ప్రాంతాల్లో, మిగతా జనావాసాల నుండి విడివడి ఉంటాయి. వారికి గల ఇన్ని ఆవాసాల్లో, మైదాన ప్రాంతాలకి దగ్గరగా గల వాటితో సహా, ఎక్కడా ఒక్క  కొలామేతర  కుటుంభమే కనిపించదు. వారు ఇంకా అంత విడిగా జీవిస్తారు. వారి భాష కూడా ప్రత్యేకం, కొలామీ భాష.   సగటు జీవిత కాలం 35 ఏళ్ళు ఉండటం గగనం. కొత్తపల్లి కొలాం గూడ గ్రామంలోని కొలాంల మీడియన్ ఏజ్ 18 ఏళ్ళు ఉంది. ప్రపంచంలోనే అతి తక్కువ మీడియన్ ఏజ్ తో బ్రతుకీడుస్థున్న నైగెర్ అనే ఆఫ్రికన్ దేశానికి దగ్గరన్నమాట.
      ఏపి, తెలంగాణ లొని చెంచు,తోటి,కొలాం ,కొలావర్, కొండరెడ్డి మొదలగు తెగలను కేంద్ర ప్రభుత్వం 1975 నుండి "ప్రత్యేకించి అంతరించి పోగల ప్రమాదం ఉన్న ఆదిమ తెగ" (పి.వి.టి.జి)లుగా  గుర్తించింది. ఇలా దేశవ్యాప్తం గా గల 705 షెడ్యూల్ద్ తెగల్లోని  75 తెగలను pvtg లుగా గుర్తించారు. వారలా గుర్తించటానికి ఆయా జాతుల జనాభా పెరగకపోవటం లేదా ఏటేటా తగ్గటం, వారు వ్యవసాయ పూర్వ కాలపు జీవన విధానంలో ఉండటం, అక్షరాస్యత అతి తక్కువగా కొనసాగటం ప్రాతిపదికలుగా ఉన్నాయి. వారి  మనుగడకే ముప్పుగా మారిన
ఈ పరిస్థితుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రభుత్వాలు ప్రకటించాయి. నలభై ఏళ్లు దాటాయి. కాలంతో పాటు వచ్చిన మార్పులు తప్ప వారినెవరూ ప్రత్యేకంగా  ఉద్దరించిన దాఖలాలు లేవు.
     పివీటిజి లు ఇటీవలి వరకూ అడవిని మాత్రమే నమ్ముకుని బ్రతికిన తెగలు . అడవి విస్తారంగా ఉన్నంత వరకు వారికి ఆహారానికి,నీటికి, స్వేచ్చ కి కొదవలేదు. కొన్ని దశాబ్దాల క్రితం వారిని ఉన్నఫలంగా అడవి నుండి బయటకు తెచ్చి మైదాన ప్రాంతాల్లో "అభివృద్ధి" చేయాలనుకున్న ఆధునిక మూఢ విశ్వాసుల ప్రయత్నం ఫలించలేదు గానీ  ఆధునికుల "అభివృద్ధి" కి  అడవులన్నీ బలి కాగా ఆదివాసీలు అడవుల్లేని గిరిజనులు గా మారిపోయారు. ఆదివాసులు మైదాన ప్రాంతాలకు రాలేదు గానీ ఈ రోజు వారి చుట్టూ అంతా మైదానమే. ఇప్పుడు వారికి అడవి లేదు. అడవి లేదు కాబట్టి ఆహారం లేదు,నీటి నిల్వలు లేవు,స్వావలంబన లేదు, స్వతంత్ర జీవన విధానం లేదు. ఒకప్పుడు కీకారణ్యాలనబడే వాటిలో నివసించిన ఆదివాసులకు ఈ రోజు వంట చెరుకు కావాలంటే కూడా ప్రయాస పడాల్సిన పరిస్థితి ఉంది. ఆహారానికి ,నీటికీ, ఉపాధికి ప్రభుత్వమో మరొకరి పైననో  ఆదారపడాలి .
         ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో తోటి,కొలాం,కొలావర్ అనే మూడు పివిటిజీ  తెగలున్నాయి. వీరిలో కొలాంలు మెజారిటి. జనాభా 33 వేల పై చిలుకు. తోటి జనాభా మొత్తం 3 వేల లోపే. కొలావర్ లు 17 వేల మంది ఉన్నారు. కొలావర్ లు ప్రధానంగా ఆసిఫా బాద్ జిల్లాలోనే ఉండగా కొలం,థొటీలు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అంతటా విస్తరించి ఉన్నారు.
       కొలాంలు ఇప్పుడిప్పుడే వ్యవసాయానికి అలవాటు పడుతున్నారు. అతి కొద్దిమందికి మాత్రమే రెవెన్యూ పట్టా భూములున్నాయి. మెజారిటీకి అటవీ పట్టా గల  పోడుభూములు  మాత్రమే ఉన్నాయి. దాదాపు ఒక 20 శాతం కుటుంభాలకు ఆ పోడుభూమి కూడా లేదు. ఆటవీ హక్కుల చట్టం వారి అభివ్రుధ్ధికి ఒక  హక్కుగా కాక వారిపై నియంత్రణగా వాడబడుతున్న ఈ సమయం లో ప్రత్యేకించి ఈ  20 శాతం ప్రజల పరిస్థితి అతి దారుణంగా తయారయింది.
   ఇక వ్యవసాయమంతా ఏ మినహాయింపు లేకుండా పూర్తిగా వర్షాధారం. ఆ భూమీ సారవంతమైనది కాదు. అంతా గుట్టలు,బోడులపై ఉన్న ఆ భూమిలో మట్టి కంటే పలుగు రాళ్ళు,మొరం,చవుడే ఎక్కువ. దాంట్లో  అందరూ పత్తినే  పండిస్తున్నారు. అతి తక్కువగానే కందులు,జొన్నలు. మైదాన ప్రాంతాల్లో ఎకరానికి 15 నుండి 20 క్వింటాల పత్తి పండితే కొలాములకు ఎకరానికి 50 కె.జీ లనుండి గరిష్టంగా 3 క్వింటాల దిగుబడి వస్తుంది. అదీ వారి వ్యవసాయ పరిస్థితి. ఇక ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు భీమాలను పోడు పట్టాలున్న వారికి ఇవ్వటం లేదు. ఇవ్వక పోవటం అహేతుకం,అన్యాయం కూడా.
    ఈ ఘనాపాటి  వ్యవసాయం  కాకుండా కొలాం గిరిజనులు చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే కూలీ పనులకు వెళ్లాలన్నా వారితో పని చేయించుకోగలిగే పెద్ద ఆసాములు వారి పరిసరాల్లో ఎవరూ ఉండరు. ఉపాధి హామీ పథకం కూడా నామ మాత్రంగానే అమలవుతోంది. అంతకు మించి నైపుణ్యం కలిగిన ఉపాధీ లేదా ఉద్యోగం చేయగలిగిన  వారు పట్టణాలకు దగ్గరగా ఉన్న కొన్ని గూడాల్లో అతి కొద్ది మంది తప్ప పెద్దగా లేరు.
         కొలాముల్లో 60 ఏళ్లకు పైబడ్డ వారి సంఖ్య బయటి ప్రాంతాల తో పోల్చినపుడు చాలా తక్కువగా ఉంది. కాబట్టి వృధాప్య పింఛన్లు పొందే వారు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇంతకు మించి ఆదాయ మార్గాలు వారికి లేవు.  "చెట్లు లేని అడవుల్లో" తినటానికి ఏమీ దొరకక, వ్యవసాయానికి సాగు నీరు లేక వారు ఆహారానికి పూర్తిగా ప్రభుత్వ చవక ధరల దుకాణం పైననే ఆధారపడి ఉన్నారు. అక్కడ దొరికే రూపాయి కిలో భియ్యమే ప్రతీ కొలాం గూడాల్లోని అన్ని ఆర్థిక స్థాయిల వారికీ జీవనాధారం. అయితే అక్కడ బియ్యం తప్ప మరో పదార్థం ఇవ్వటం లేదని వారు భాదపడుతున్నారు .
           ఆహారం తర్వాత వారికి గల రెండవ  అతి ముఖ్యమైన జీవన్మరణ సమస్య తాగునీరు. ఈ సమస్య నగరీకుల సోకుల కోసం జరిగిన అడవుల నరికివేతతో   అటవీ ప్రాంతాల్లో ఉపరితల, భూగర్భ జలాలు పడిపోవటంతో మొదలయింది. పక్షులు,జంతువుల మాదిరి నీటికొసం అల్లాడుతూ తాగటానికి పనికిరాని నీళ్లను కూడా తాగుతూ నీటి ద్వారా సంక్రమించే రోగాలైన కలరా,అతిసార వ్యాధి, టైఫాయిడ్,కామర్ల భారిన పడి ఆదివాసీలు  అర్థాంతరంగా చనిపోవటం అక్కడ నిత్య దృశ్యం.
 ఈ సమస్య పరిష్కారానికి కొంతమంది నిజాయితీ గల  ప్రభుత్వాధికారులు కొన్ని ప్రయత్నాలు చేశారు గానీ అవి ప్రయోగాల స్థాయిలోనే పని చేశాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం లో భాగంగా గుట్టలు,లోతట్టు ప్రాంతాలకు సైతం పైపు లైన్లు వేశారు. అదిలాబాద్ రూరల్ మండలం లో  కొన్ని గ్రామాలకు నీళ్లు కూడా ఇస్తున్నారు. అయితే పట్టణ ప్రాంతాలకు ఇచ్చినంత తరచుగా మాకివ్వటం లేదని లోతట్టు ప్రాంతాల వారు చెప్తున్నారు.
     ఇక pvtg లు అక్షరాస్యత లో వెనుకబడ్డారని ప్రభుత్వాలు గుర్తించి కూడా ప్రత్యేక ఏర్పాట్లేవీ  చేయక పోవటం గమనార్హం. 90 శాతం కొలాం గూడాలల్లో అంగన్వాడీ ఉపాధ్యాయునుల్లేరు. ప్రాథమిక బడులు 2 నుండి 3 కి.మీ   దూరంలో ఉంటాయి. పిల్లలను స్కూలుకు తరలించే ఏర్పాటేదీ ప్రభుత్వం చేయదు. చచ్చీ చెడి స్వంతంగా ప్రాథమిక విద్య వరకు వెళ్ళగలిగినా ఆపై బడులు  అందుబాటులో ఉండవు,హాస్టల్ లో ఉంటే తప్ప. ఈ పాటి బళ్లలో విద్యా వాలంటీర్ లే పెద్ద సార్లు. మేం అధ్యయనం చేసిన 8 కొలాం గూడాల్లో రెండింటిలో అక్షరాస్యత అక్షరాలా జీరో.
       వైద్య సౌకర్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ANM లు దాదాపు ఎవరూ గూడాల్లోకి వెళ్లటం లేదు. డెలివరీలు ఇంట్లోనే కావటం అక్కడ సర్వ సాధారణం. సగం డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉంటాయి.  ఉన్నవారిలో నిజాయితీ గా పని చేసే వారు తక్కువ. జిల్లా కేంద్రం లోని RIMS బోధనాసుపత్రి పరిస్థితీ కొలాంల జీవితం లాగే ఉంటుంది. ఇక అంతకంటే కింది ఆసుపత్రుల పరిస్థితి చెప్పే పనిలేదు.
     ఈ రోజు ఆదివాసుల సంస్కృతి  చిక్కి శల్యమౌతున్న వారి భాషలో  తప్ప అంతటా కనుమరుగౌతున్నది.  విగ్రహం,గుడి అంటే మొన్నటిదాకా తెలియని మనుషుల మధ్య ఇప్పుడు అన్ని గూడాలల్లో హనుమాన్ విగ్రహాలు వెలిశాయి. హనుమాన్,అయ్యప్పl దీక్షలు ఊపందుకున్నాయి.  మాకిప్పుడు హనుమాన్  మందిర్ కట్టివ్వాలి అని అప్రయత్నంగానే  అంటున్నారు. ఆర్థికంగా మోస్తరుగా ఉన్న గూడాలల్లో భారీ గోపురాలు ఇప్పటికే వెలిశాయి. అనుకరణ జాడ్యంలో పడి ఆర్యేతర నాగరిక సంస్కృతే అడ్రసు లేకుండా పోయింది. పరాయీకరణకు గురైతున్న తమ ప్రత్యేక సంస్కృతి  గురించి ఆదివాసీ సంఘాలేవీ పట్టించుకోకపోవటం ఆశ్చర్యమే.
         ఈ మధ్య అటవీ హక్కుల చట్టం ప్రకారం స్వంత ఇళ్ళూ భూములూ ఉన్నట్టు ప్రభుత్వంచే గుర్థింపబడని వారిని అక్కడి నుండి వెల్లగొట్టాలని సుప్రీమ్ కోర్టు ప్రభుత్వాలకు ఒక ఆదేశం ఇచ్చింది. తాత్కాలికంగా ఈ ఆదేశం తొందరపాటని తన తీర్పుపై తానే స్టే ఇచ్చుకున్నా దేశ అత్యున్నత న్యాయ మూర్తులకే ఇంత ఊగిసలాట ఉంటే ఇక స్థానిక అటవీ అధికారులు,పోలీసుల గురించి చెప్పేదేముంది. ఎప్పుడెప్పుడు ఆదివాసులను వెల్లగొడదామా అని చూస్తున్నారు. ఎక్కడకని వెల్లగొడతారు. తమ మాతృభూమి అయిన అడవిలోనే వారికి ఇళ్ళూ భూములు లేకపోతే మైదాన ప్రాంతాల్లో ఉంటాయా. బుద్ది లేని వారికి చెప్పవచ్చు ,కానీ ఆదివాసులు కూడా తమ లాంటి పౌరులేనని తెలియని పాలకులకు ఎలా చెప్పటం. ఆదివాసీ ప్రాంతాల్లో  ఖనిజ సంపద కైవసానికై ఆదివాసులను క్రమంగా అక్కడ నుండి ఖాళీ చేయిస్తున్నారనే ఆరోపణ నిజమే అయ్యుండాలి.
            ఇలా బహుముఖాలుగా అన్యాయానికి, దాడికి గురౌతూన్న ఆదివాసీలు ప్రత్యేకించి కొలాంల వంటి అత్యత విలువైన ఆదిమ తెగలకు నాగరికులమనుకునే పాలకులు,అధికారులు మరింత అన్యాయం చేయటం క్షమించరాని నేరం. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు,అవకాశాలు ఆదివాసులకూ వర్తిస్తాయి. వారి జీవితాల్తో ఆటలాడుకోవటం, అభివృద్దిలో వివక్ష, చిన్నచూపు  ప్రజాస్వామ్య స్పూర్థికి విరుద్దం. ఇప్పటికైనా వారికి గల స్వేచ్చగా,గౌరవప్రదంగా జీవించే హక్కును గౌరవిద్దాం.
      డా.ఎస్.తిరుపతయ్య ,
        మానవ హక్కుల వేదిక.
       (Written on 22.06.2019)
        (27.07.2019 ఆంధ్ర జ్యోతి)

Friday, July 26, 2019

పూలన్ దేవి 18 వ వర్దంతి || Gondwana channel ||

చట్టం దృష్టిలో నాది నేరం - నా దృష్టిలో అదే న్యాయం"
అగ్రవర్న దురాహంకారం పై సర్జికల్ స్ర్టైక్
పూలన్ దేవి
పూలన్ దేవి  18 వ వర్దంతి
జూలై 25
వారం రోజుల పాటు 18 ఏండ్ల అమ్మాయిని మదమెక్కిన అగ్ర కుల  కామందులు నిర్భంధించి మానబంగం చేసేరు. ఏ కోర్టు , చట్టం చెయ్యలేని పనిని ప్రతీకారం తో ఆడపిల్ల అవసరం అయితే సింహంలా  మారుతుంది అని రుజువు చేసిన వ్యక్తి "ఫూలన్ దేవి "

అణగారిన వర్గాల స్త్రీ కనుక బంది పోటు రాణి ( Bandit Queen )అన్నారు. నేను అయితే బారత రాణి ( Indian Queen) అంటున్న.

దేశం లో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆడపిల్ల హత్యాచారానికి గురి అవుతుంది. కాని ఎక్కడా శిక్షలు పడటం లేదు.  అందుకే ఆనాడు ఫూలన్ దేవి చేసిందే న్యాయం. ధర్మం.

టైమ్స్ పత్రిక ఫూలన్ దేవిని ప్రపంచం లో అత్యంత ferocious మహిళ లో 3 వ స్తానం ఇవ్వగా , బారత దేశం లో మొదటి స్తానం లో ఉంది.

బెహమై - ఉత్తర ప్రదేశ్  నుండి  పార్లమెంట్ దాకా. ఒక మహా ప్రస్తానం. ప్రపంచం లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం.

అగ్రకుల మనువాదులు పూలన్ దేవి చేతిలో తుపాకీ లేని సమయం లో తుపాకీ తో కాల్చి చంపేసి మరొక్కసారి ఈ దేశ చరిత్రని అగ్రకుల ఆదిపత్య దేశం గా రాసేరు.

Phulan Devi, an example of bravery and self respect.

Phulan Devi not a bandit queen, she was queen of self respect.

జననం 10 - 08- 1963
మరణం 25 - 07- 2001


https://www.youtube.com/c/gondwanachannel ఇది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చానెల్ ను అందరూ SUBSCRIBE చెయ్యండి.

Thursday, July 25, 2019

పరిహారక అటవీకరణ నిధి చట్టం || Gondwana channel ||


పారిశ్రామిక తదితర అటవీయేతర అవసరాలకు కోల్పోతున్న అడవులను భర్తీ చేయడం పరిహారక అటవీకరణ లక్ష్యం. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016లో తీసుకువచ్చిన ‘పరిహారక అటవీకరణ నిధి చట్టం’తో ఈ ప్రక్రియ మరింత బలం సంతరించుకుంది. ఈ చట్టం కింద కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల అటవీశాఖలకు త్వరలోనే రూ.56,000 కోట్లు అందుతాయి. అంటే, ఆదివాసుల భూములు మరిన్ని అన్యాక్రాంతమవుతూ, ఆ భూములపై వివాదాలు మరింత తీవ్రమవుతాయి.

గోండ్ గిరిజనుడు బాబూలాల్ తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఇంతలో కొంతమంది వ్యక్తులు వచ్చి, ఆ పొలానికి సున్నపు రాయితో హద్దులు గీసి, సిమెంట్ స్తంభాలు నాటారు. విస్మయానికి గురైన బాబూలాల్ ఏమిటిదంతా అని అడిగాడు. వారు అతడికి తెలియని భాషలో ఏదో చెప్పారు. ఇది, ఛత్తీస్‌గఢ్ కొరియా జిల్లాలోని థగ్గోన్ గ్రామంలో చోటుచేసుకున్న ఉదంతం. బాబూలాల్‌కు ఎదురైన అనుభవమే ఆ పల్లెలోని మరో -40 కుటుంబాల వారికీ, పొరుగు గ్రామమైన ఛోటెసల్హి వాసులకు కూడా ఎదురయింది. తన పొలానికి వచ్చిన అపరిచిత కూలీలు మొక్కలు నాటబోతున్నామని చెప్పారని పన్నాలాల్ సాయి గుర్తు చేసుకున్నాడు. అసలు విషయాన్ని తెలుసుకోవడానికి బాబూలాల్, పన్నాలాల్ తదితరులు సమష్టిగా ప్రయత్నించినప్పుడు జిల్లా అటవీశాఖాధికారుల ఆదేశాల మేరకే ఆ కూలీలు వారి పొలాలకు హద్దులు ఏర్పాటు చేసారని, ఆ భూములలో మొక్కల పెంపకానికే అదంతా చేశారని తెలిసింది.

‘భూములే మా జీవనాధారం. ప్రభుత్వం వాటిని తీసుకుంటే మేమెలా బతకాలి?’ అని పన్నాలాల్ ప్రశ్నించాడు. అవును, ఆ ఆదివాసులు ఎలా బతకాలి? భారత్‌లో గనుల తవ్వకం, మౌలిక సదుపాయాల నిర్మాణం ఇత్యాది అటవీయేతర ప్రయోజనాలకు అటవీ భూములను ఉపయోగించుకున్నప్పుడు చట్టం ప్రకారం ‘పరిహారక అటవీకరణ’కు (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్-–సిఏ) పూనుకోవల్సి వుంటుంది. ఎంత విస్తృతిలో అటవీ భూములను ఉపయోగించుకున్నారో అంతే విస్తృతిలో అటవీయేతర భూములలో అడవిని అభివృద్ధిపరచాలి. గతంలో పరిహారక అటవీకరణ కింద అటవీయేతర భూములలో యూకలిప్టస్, నల్లతుమ్మ మొదలైన దేశీయేతర, వాణిజ్యవృక్ష జాతుల మొక్కలను అటవీశాఖ సిబ్బంది పెంచేవారు. ఇటువంటి తోటల పెంపకాన్ని అడవుల అభివృద్ధిలో భాగంగా భారత ప్రభుత్వం పరిగణిస్తోంది. అడవుల విస్తృతిని పెంపొందించడం, వనాలను సంరక్షించడమనే 2015 పారిస్ వాతావరణ మార్పు ఒప్పందంలోని కీలక అంశాలకు అలా నిబద్ధమవుతున్నామని కేంద్రప్రభుత్వం చెబుతోంది.

థగ్గోన్, ఛోటెసల్హి, మరో పధ్నాలుగు గ్రామాలలో పరిహారక అటవీకరణ ప్రాజెక్టు పర్సా కోల్ బ్లాక్‌కు సంబంధించినది. ఆ గనుల తవ్వకానికి గాను నష్టపోతున్న అడవికి ప్రత్యామ్నాయంగా కొరియా జిల్లాలోని 16 గ్రామాలలో, నాలుగువేలకు పైగా ఎకరాలలో చేపట్టనున్న ఈ పరిహారక అటవీకరణ ప్రాజెక్టు వందలాది ఆదివాసీ కుటుంబాల జీవనాధారాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నది. పారిశ్రామిక, ఇతర అటవీయేతర ప్రయోజనాలకుగాను నష్టపోతున్న అడవులను భర్తీ చేయడమే పరిహారక అటవీకరణ లక్ష్యం. ఈ లక్ష్య సామంజస్యాన్ని పలువురు ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016లో తీసుకువచ్చిన ‘పరిహారక అటవీకరణ నిధి చట్టం’ (కాంపెన్సెటరీ అఫారెస్టేషన్ ఫండ్ యాక్ట్‌–సీఏఎఫ్‌ యాక్ట్)తో ఆ లక్ష్యం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. సిఏఎఫ్ చట్టం అమలుకు అనుసరించవలసిన నియమ నిబంధనలను 2018లో మోదీ ప్రభుత్వం జారీ చేసింది. ఈ చట్టాన్ని భూ సంస్కరణలకు అనువర్తింపచేయాలని, అటవీ హక్కుల చట్టం (2006) నిర్దేశించిన అటవీ పాలనా సంస్థల వికేంద్రీకరణతో సిఏఎఫ్ అమలును సమన్వయం చేయాలని, పరిహారక అటవీకరణ నిధుల వినియోగానికి సంబంధిత గ్రామ ప్రజల ఆమోదాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆదివాసులు, అటవీహక్కుల పరిరక్షణ సంఘాలు, ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లను మోదీ ప్రభుత్వం తోసిపుచ్చింది.

సిఏఎఫ్ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వాల అటవీశాఖలకు త్వరలోనే రూ.56,000 కోట్లను కేంద్రం అందించనున్నది. తమ ప్రాజెక్టులకు అటవీ సంబంధిత అనుమతులు పొందిన పారిశ్రామికవేత్తలు చేసిన చెల్లింపులతో ఈ భారీ మొత్తం సంచితమయింది. పరిహార అటవీకరణకు ఎంపిక చేసుకున్న భూముల ‘నికర ప్రస్తుత విలువ’, ఆ ప్రత్యామ్నాయ భూములలో మొక్కల పెంపకానికి అవసరమయ్యే వ్యయానికి జరిపిన చెల్లింపులవి. ఈ చెల్లింపులు ఏ అంశంలో ఎంత ఉండాలనేదాన్ని అటవీశాఖే నిర్ణయిస్తుంది. సాధారణంగా ఈ విలువ హెక్టారుకు 5 నుంచి 11 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ భారీ మొత్తాల గురించి ఆనందించవలసింది ఏమీ లేదు. ఒక విధంగా ఇది ‘బ్లడ్ మనీ’ (హతుని కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా హంతకుడు చెల్లించే సొమ్ము). అడవులను ఏ మేరకు కోల్పోతున్నదీ ఈ భారీ మొత్తం సూచిస్తున్నది.

సిఏఎఫ్ చట్టం క్షేత్రస్థాయిలో ఘర్షణలకు దారితీసే అవకాశం చాలా ఉంది. అంతేగాక అది సహజ వనరులపై వివిధ సామాజిక వర్గాల, ముఖ్యంగా ఆదివాసీల హక్కులను బలహీనపరుస్తుంది. వారి ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఛత్తీస్‌గఢ్, ఒడిషాలలో మేము జరిపిన అధ్యయనాలలో తేలింది. 2014–-18 సంవత్సరాల మధ్య 1.24 లక్షల హెక్టార్ల అడవుల నరికివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. పరిహారక అటవీకరణకు అంతే వైశాల్యంలో ప్రత్యామ్నాయ భూములను కేటాయించినట్టు అధికార పత్రాలలో పేర్కొన్నారు. పరిహారక అటవీకరణకు అంత విస్తృత స్థాయిలో భూమి అందుబాటులో ఉండటం అసాధ్యం. పెరుగుతోన్న జనాభా అవసరాలకు అనుగుణంగా భూముల లభ్యత లేని దేశం మనది. మరి వేలాది హెక్టార్ల భూమి అటవీశాఖకు ఎక్కడ లభిస్తుంది? పరిహారక అటవీకరణ పేరుతో గ్రామీణ బలహీనవర్గాల, ఆదివాసీల భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తున్నదని అటవీహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పరిహారక అటవీకరణకు అవసరమైన భూ బ్యాంకులను సృష్టించాలని 2017 నవంబర్‌లో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భూబ్యాంకులు ఆదివాసీలను నిర్వాసితులను చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయని ఆదివాసీ రచయిత గ్లాడ్సన్ డంగ్ డంగ్ వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌లో ఉమ్మడి భూములు, అటవీభూములతో సహా 20 లక్షల ఎకరాలను భూ బ్యాంకులలో నమోదు చేశారని ఆయన అన్నారు. తమ జీవనాధారాలుగా ఉన్న భూములు హఠాత్తుగా తమవి కాకుండా పోవడంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయి. తొలుత అడవుల నరికివేత, ఆ తరువాత పరిహారక అటవీకరణ పేరిట వేలాది ఆదివాసీ కుటుంబాలు రెండుమార్లు నిర్వాసితమయ్యాయి. ఈ శోచనీయ పరిస్థితికి పర్సా కోల్ బ్లాక్ పరిహారక అటవీకరణ ప్రాజెక్టు సరైన ఉదాహరణ.

2019 ఫిబ్రవరిలో పర్సా కోల్ బ్లాక్ మొదటి దశకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. ఈ బొగ్గు గనులను రాజస్థాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాజస్థాన్ రాజ్య విద్యుత్ నిగమ్‌కు కేటాయించారు. దీని ప్రకారం గనుల తవ్వకానికై 1600 ఎకరాల వైశాల్యంలోని పచ్చని అడవులను నరికివేస్తారు. పరిహారక అటవీకరణకు కొరియా జిల్లాలో నాలుగువేల ఎకరాల భూమిని గుర్తించడంతో, సదరు 16 గ్రామాలలో అటవీకరణకు అవరోధాలు, నిరోధాలు, అభ్యంతరాలు లేవని జిల్లా కలెక్టర్ ధ్రువీకరణపత్రం మేరకే పర్సా కోల్ బ్లాక్ మొదటి దశకు అనుమతి లభించింది. అయితే వాస్తవాలు అధికారిక కథనాలకు విరుద్ధంగా ఉన్నాయి. అధికారులు ఎవ్వరూ తమను పరిహారక అటవీకరణ గురించి సంప్రదించనేలేదని ఆ 16 గ్రామాలలో నేను పర్యటించిన ఎనిమిది గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. ఆ భూములే తమ జీవనాధారాలు గనుక తాము ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పారు.

అటవీ భూములపై తరతరాలుగా ఆధారపడివున్న సామాజిక సమూహాలకు ముఖ్యంగా ఆదివాసులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సరిదిద్దేందుకుగాను దశాబ్దం కిత్రం అటవీహక్కుల చట్టాన్ని (ఎఫ్ఆర్ఏ) తీసుకొచ్చారు. ఆదివాసులకు ఆ భూములపై గల యాజమాన్య హక్కులను గుర్తించడం ఈ చట్టం లక్ష్యం. అయితే ఇది ఆచరణలో విఫలమయిందని ‘కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ -లెర్నింగ్ అండ్ అడ్వొకసీ నెట్‌వర్క్’ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. అటవీభూములపై తమ హక్కులను గుర్తించాలని ఆదివాసులు పెట్టుకున్న దరఖాస్తులలో యాభైశాతాన్ని అధికారులు తిరస్కరించారు. కొత్తగా వచ్చిన సిఏఎఫ్ చట్టంతో అటవీభూములపై ఆదివాసుల హక్కులను గుర్తించడమనేది మరింత ప్రమాదంలో పడింది. పర్సా కోల్ బ్లాక్ భూముల వ్యవహారమే ఇందుకొక ఉదాహరణ.

2016 జూలైలో సిఏఎఫ్‌ను ఆమోదించకముందే దానివల్ల తలెత్తే సమస్యలను ప్రధానమంత్రికి పలు ప్రజా సంఘాలు తెలియజేశాయి. అధికారిక వర్గాలలో కూడా ఆ బిల్లు పట్ల వ్యతిరేకత వ్యక్తమయింది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివిధ డాక్యుమెంట్లు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయినప్పటికీ పార్లమెంటు సిఏఎఫ్‌ను ఆమోదించింది. పరిహారక అటవీకరణకు కేటాయించిన భూములపై స్థానిక ప్రజలు తరతరాలుగా తమ జీవనోపాధికి ఆధారపడివున్నారన్న వాస్తవాన్ని అధికారులు ఉపేక్షించడం గర్హనీయం. ఒడిషా కెయోంఝర్ జిల్లాలో దైతారీ గనుల తవ్వకం కోసం, స్థానిక గిరిజనులు పోడు చేసుకుంటున్న 1700 ఎకరాల భూములను పరిహారక అటవీకరణకు కేటాయించారు. ఒడిషాలో వివిధ పరిహారక అటవీకరణ ప్రాజెక్టులకు రూ.6000కోట్లకు పైగా కేటాయించారు. ఇది అటవీశాఖ వార్షిక బడ్జెట్‌కు పదిరెట్లు అధికం. దీన్నిబట్టి పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఎంత విస్తృతస్థాయిలో అడవుల విధ్వంసానికి అనుమతినిచ్చారో విశదమవుతుంది.

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సిఏఎఫ్‌, ఎఫ్ఆర్ఏ భూ వివాదాలను తక్షణమే పరిష్కరించవలసిన అవసరం ఉంది. పరిహారక అటవీకరణకు కేటాయించే భూముల విషయంలో ముందుగా గ్రామ సభ ఆమోదాన్ని పొందాలని, అలాగే నిర్వాసితులకు విధిగా పునరావాసం కల్పించాలన్న కనీస న్యాయసూత్రాలు పూర్తిగా ఉల్లంఘనకు గురవుతున్నాయి. సిఏఎఫ్ చట్టం అమలుకు కేంద్రంనుంచి రాష్ట్రాలకు త్వరలో భారీ ఎత్తున నిధులు అందనున్నందున పరిహారక అటవీకరణ ప్రాజెక్టులకు మరిన్ని భూములు కేటాయించే అవకాశం చాలా ఉన్నది. ఆదివాసుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా భూములకు డిమాండ్ పెరుగుతుంది; ఆ భూములపై తలెత్తే వివాదాలు మరింత తీవ్రమవుతాయి. సిఏఎఫ్, ఎఫ్ఆర్ఏలు మౌలికంగా భిన్నమైన చట్టాలని ‘ఏక్తా పరిషత్’ జాతీయ కో ఆర్డినేటర్ రమేశ్ శర్మ అంటున్నారు. ‘సిఏఎఫ్ అధికార వర్గాల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చేది కాగా, ఎఫ్ఆర్ఏ ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చేది. కనుక ఈ రెండు చట్టాల అమలులో ఘర్షణలు అనివార్యం’ అన్నారాయన.

చిత్రాంగద చౌధురి
పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా

https://www.youtube.com/c/gondwanachannel ఇది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చానెల్ ను అందరూ SUBSCRIBE చెయ్యండి.

Monday, July 22, 2019

MBBS సీటు సాదించిన ఆదివాసీ అమ్మాయి. || Gondwana channel ||

MBBS సీటు సాదించిన ఆదివాసీ అమ్మాయి.
వెడ్మ భావ్యశ్రీ
వెడ్మ యశ్వంత్ రావు(Teacher)-వెడ్మ కమల (Ex ZPTC,తిర్యాని) దంపతుల కుమార్తే .
ప్రభుత్వ కొటలొ Mahaveer Medical college సీటు సాదించారు.  భవ్యశ్రీ కి వారి తల్లి తండ్రులకు తిర్యాని మండల ఆదివాసుల తరపున Congrats, వైద్యవిద్యా అభ్యసించి ఆదివాసీలకు సేవాచేయాలని కొరుతున్నాము.


Sunday, July 21, 2019

సాలు దేవుళ్ల పండుగ || Gondwana channel ||

భద్రాద్రి జిల్లా, కరకగూడెం మండలం రఘునాధపాలెం పూర్వం గ్రామం పేరు(పాతూరు) గ్రామంలో ప్రతి మూడేళ్లకు ఒక్కసారి...ప్రకృతి సహజసిద్ధమైన వివిధ రకాల..........
సాలు దేవళ్ళు పాండవులు,ముసలమ్మ,ముత్యాలమ్మ,కొరసమారి,ఉప్పారమ్మ,మైసమ్మ,ఎర్రమ్మ, గ్రామ దేవతలు ను అనాదిగా పూర్వం నుండి ఆదివాసీలు సంస్కృతి సంప్రదాయం ప్రకారం గ్రామ పెద్దలు, యువకులు గ్రామస్తులు ఈ రోజు ఉత్వహాంగా నిర్వహించారు.మన ఆదివాసీ గ్రామాల్లో జరిగే ప్రతి సంస్కృతి సంప్రదాయ పండుగలను వెలుగులోకి తీసుకురావాలి అని ఆశిస్తున్నా.....


👉పాండవులు కు పాలు పొంగించుట.

👉సాలు దేవుని కి వరహము (పంది)ని బలి ఇవ్వటం జరుగుతుంది.

👉గ్రామ దేవతలు కు మొక్కలు చెల్లించుట జరుగును.

ఈ కార్యక్రమంలో పోలేబోయిన దొరలు, పులి దొరలు, కొమరం, గొంది,చందా,సోలం వివిధ ఇంటి పేర్ల కోయదొరలు మరియు గిరిజనేతరులు కూడా  పాల్గొన్నారు.

జై ఆదివాసీ జై జై ఆదివాసి

Saturday, July 20, 2019

క్రి.శే. సిడం శంభు పటేల్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నా.. సోయం బాపురావు గారు || Gondwana channel ||

ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మతడిగూడా(శంభు పటేల్ గూడా) లో ఆదివాసీ నాయకుడు ,ఆదివాసీ ఐక్యవేధిక అధ్యక్షుడు క్రి.శే. సిడం శంభు పటేల్ ప్రథమ వర్ధంతి సందర్బంగా వారి కుటుంబానికి రూ. 50000 యాభై వేళ్లు ఆర్థిక సహాయం చేస్తున్నా.. ఆదివాసీ ముద్దు బిడ్డలు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు. గౌరావ శ్రీ.. సోయం బాపురవు గారు మరియు ఆసిఫాబాద్ శాసనసభ్యుడు ,గౌరవ శ్రీ.ఆత్రం సక్కు గారు..ఈ సంధర్బంగా వారు మాట్లాడతూ సిడం శంభు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు..

తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు సీడాం శంభు గారి మొదటి వర్ధంతి || Gondwana channel ||

20-07-2019
తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు... నిరతరం ఆదివాసీల కోసం తన జీవితంను ధారబోసిన సీడాం.సంభు గారి వర్ధంతి ఈరోజు.....తొలితరం ఉధ్యమ నాయకుడిగా 1996లో తుడుందెబ్బ సంఘం ను ఏర్పాటు చేసి ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం)తన ఉధ్యమ పటిమతో అనేక ఆదివాసీ హక్కులు సాధించిన ధీరుడు....ఇంద్రవేళ్ళి రగల్ జెండ దగ్గర పోలీసు నిర్బంధం ఉన్న కంచెను తెంచి అమరులకు నివాళి అర్పిచిన మొదటి వ్యక్తి..... పోడుభూల సమస్యలపై పోరాటాలు చేసి పట్టాలు సాధించిపెట్టాడు....1/70..,పీసా అమలుకు గట్టి ఉధ్యమం చేశాడు....ఆదివాసీల సంస్ర్కుతి సంప్రదాయం బయట ప్రపంచానికి పరిచయం చేశాడు..... తన ఉధ్యమ పటిమ...,వాక్చాతుర్యంతో దేశ...రాష్ట్ర మీడియా ని ఆదివాసీల వైపు మళ్ళించాడు...ఈ రోజు ఎందరో ఆదివాసీ ఉధ్యమ యువ నాయకులు సిడాం. సంభు గారి శిస్యులే అనడంలో సంధేహం లేదు.ఎవరికీ ఏ సమస్య ఉన్నా నేరుగా అధికారులతో మాట్లాడి ఎందరో మంది సమస్యలు పరిష్కారం చేశాడు......సిడాం.సంభు గారు *నిరుద్యోగ సమస్యలపై *ANS** కు అనేక సంధర్భాలలో సలహాలు..సూచనలు చేసేవారు...అలాంటి ఆదివాసీ ఆత్మబందువు మన మధ్య లేకపోవడం బాధాకరం... ఆయన ఆత్మకు శాంతీ చేకూరాలి.....మీ ఆశయాలను జాతికోసం మా వంతుగా సాధించాడానికి కంకణబద్దంలై పనిచేస్తామని తెలుపుతూ......జోహర్ శంభు దాదా ..
మీ  మడావి దత్తు అధ్యక్షుడు ఆదివాసీ నిరుద్యోగ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

Tuesday, July 16, 2019

ఆదివాసీ ఉద్యమ గీతం

ఎవడురా?వాడెవడురా?
మా భావ ప్రకటనా స్వేచ్ఛను
బంధించేదెవడురా
మా వేదికల్ని మూసుకొమ్మని
చెప్పేది ఎవడురా? // ఎవడురా//
మాకలాలపై గళాలపై
నిర్భంధం ఎందుకు?

అణగారిన జనాలకు
అండగ ఉన్నందుకా
మీ దోపిడి దొరతనాని
కడ్డు తగిలినందుకా? // ఎవడురా//

ఆదివాసులనడవినుండీ
తరిమి వేసెటందుకా?
అడవంతా కార్పోరేట్
కప్పగించెటందుకా? //ఎవడురా//

మీ నియంతృత్వ పోకడలు
నింగినంటేటందుకా?
మీ ఇనుపా పాదాలతొ
అణిచివేయటానికా? // ఎవడురా//

మా కలాల్ని ఇరిసేసినా
మాగళాల్ని మూసేసినా
ఫీనిక్స్ పక్షిలాగ పుట్టుకొస్తుంటమూ
మీ దోపిడీ కోటలను
కూలదోస్తుంటమూ....! !
✊✊✊✊✊✊✊
వుకే రామకృష్ణ దోర
ఆదివాసీ నాయకుడు

Saturday, July 13, 2019

గోండి భాష దినోత్సవము

జై సేవా సేవా జోహర్
ఆదిమ వాసుల అస్తిత్వము
ఆదిమ వాసుల అస్తిత్వము
వారి బాష, సంస్కృతి, వారి ప్రతేకమైనటువంటి జీవన విధానము బాష, సంస్కృతి, వారి ప్రతేకమైనటువంటి జీవన విధానమే వారి ప్రతేకత
కావున వారు తమ దైన శైలిలో ప్రతేక మైనటు వంటి ప్రదేశాలలో నివాస ప్రదేశాలను ఎంచుకొని అట్టి ప్రాంతమందలి ప్రదేశాలోనే నివాసము ఏర్పరచుకొని జీవిస్తున్నారు. కావున వారిని ప్రభుత్వము కూడ ప్రత్యేకముగా గుర్తించి వారి జాతులను రక్షణ కు వారి భాష, సంస్కృతి, సాంప్రదాయాలను రక్షణ కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే 9అఘష్ట1986యు యన్ ఒ గుర్తించి ప్రపంచఆదివాసి దినోత్సవమును జరుపుటకు మనకు అనుమతి నిచ్చింది అలాగేఆదివాసిభాస లకు కూడ  యు యన్ ఒ గుర్తింపు నిచ్చింది ఇందులో భాగంగానే ప్రభుత్వము చొరవ తీసుకొని ఎవరిభాషను వారు కాపాడు కోవాలని నిర్ణయించి ఎవరి భాష వారు తమ భాష దినోత్సవమును గుర్తించి ఆరోజు వారి భాష దినోత్సవమును జరుపుకుంటున్నారు అలాగే మన భాష గోండి భాష, మన భాషను మనము రక్షించ వలసిన భాద్యత మన పైన ఉంది మన భాషకు మనమే గుర్తింపు ఇవ్వవలసి ఉందని గుర్తించి న మన గోండి సమాజము ఒక నిర్ణయానికివచ్చి మెుట్ట ముదటి కార్యశాల 2012న దన్నెగాం నందు గోండ్వాణ దర్శనము ఎడిటర్ సన్హెరీబు సింగ్ తారం మరియు గోండి యన్ తొలి కవయిత్రిఊష కారని ఆత్రం వారి ఆద్వర్యంలో రాష్ట్ర గోండి భాష అద్యాయనకేంద్రము ఏర్పటు చేయడం జరిగింది.  తరువాత రమనికచౌదరి పౌడేషన్ఆద్వర్యములో 2015డిల్లి యందలి జే యన్ యు నందు వివిద ఆదిమభాషలకార్యశాల పేకల్టి ఆప్ లాంగ్వేజెస్ అండ్ సోషల్ సర్వషెస్ఆద్వర్యము లోజరిగంది తరువాత వచ్చెసి2014 ,21జులై తేదిని నిశ్చయించి గోండి భాష దినోత్సవమును యవత్ భారతదేశ గోండులు జరుపు కుంటున్నాము.కావున
ఆరోజు యెుక్క ప్రత్యేకత ఏమనగా గోండి భాష మాట్లాడే ప్రజలు యవత్త్ భారత దేశంలో18రాష్టములలో నివశిస్తున్నారు వీరందరు ఒక చోటికి ఎలా రావచ్చు అని ఆలోచించి వీరందరిని ఒక చోటికి కలిపే ఒకే ఒక మాధ్యమము ఉంది అదే భాష అని గుర్తించి న మన యేాదుడు శుబ్రంషు చౌదరి గారు పుట్టుక లో బెంగాల్ కు చెందినవారు వారు  బి బిసి లండన్ యందు పని చేస్తున్నారు వారు ఆఉద్యోగమునకు రాజీనామా చేసి బయటకు వచ్చేసి  సి జి నెట్ సెంట్రల్ గోండ్వాణ నెట్ వర్క్  యన్జీవొను ఏర్పాటు చేసి వారు గోండ్ వానా ప్రదేశములను సందర్సంచి ఒక ఆదివాసి మిడియను ఏర్పాటు చేసారు. ఈ మిడియను ఆదారముగా చేసి డిల్లి లోని గాంది స్ముృతి దర్శనము వారి ఆధ్వర్యంలో 13రాష్టాలగోండులను పిలిపించి 5రోజుల కార్యశాల ఏర్పాటు చేసి గోండి భాష ప్రామాణిక కార్యశాల 2014జులై21నప్రారంబించి ఈ కార్యశాల వివిద సంవత్సరములు వివిద రాష్ట్ర ల యందు నిర్వహిస్తూ2014నుండి2016వరకు ప్రతి రాష్ట్ర కార్యశాల కు ప్రతి రాజ్యము నుండి తప్పక పది మంది తో కల్సి2016 న గోండి భాష ప్రామాణిక నిఘంటువును    డిల్లినందలి అంబెద్కర్ భవన్ యందు జులై 5 ,2016 గోండి భాష విమెాచనదినముగా పరిగనించి గోండి భాష ప్రామాణిక నిఘంటువు అవిస్కరన జరిగింది.
కావున మన మందరము మన భాషకు గర్వకారణంగా భావించి 21జులై2019 ఆదివారము రోజున గోండి భాష దినోత్సవమును జరుపు కుందాము  జై సేవా సేవా జోహర్ జై గోండ్వణ

Sunday, July 7, 2019

ఆకాడి పండుగ Akadi celebration(vanapuja)

Gonds of adilabad district perform akadi ritual at forest to protect their cows and goats from wild animals although the gusadi dan dari celebration yetmasur akada pen is being started up to four months chochoy dance wil be played asada month to deepavali.

ఈరోజు తెలంగాణ రాష్ట్రం  ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉట్నూర్ మండలం కేంద్రం లో ఆదివాసుల ముఖ్య  ఆషడ మాసంలో (ఆకాడి) పండుగా జరుపుకున్నారు.ఈపండుగాకు మా సంస్కృతి సాంప్రదాయంగా అడవిలో వన దేవతలకు పూజలు నిర్వహించారు.అడవిలో పశువులు మేపడనికి కాని అడవిలో మనుషులు కూడా స్వచ్ఛంగా తిరిగి రావడానికి అకాడి పూజాలు చేయడం జరిగింది. ఈరోజు నుండి దండారి (అకాడ) ఆటలాతో పాటలతో కోలాటాలు ఆడుకోవడం సులువవుతుంది.
ఈ పండుగాను ఆదివాసులు చాలా ఘనం గా ఆనందంతో.. రాజులు దేవాతలను పూజలు నిర్వహించడం జరుగుతుంది.







Saturday, July 6, 2019

సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాను - కలెక్టర్ దివ్య

ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీమతి దివ్య దేవరాజన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు కుమ్రంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం అన్ని ఏజెన్సీ మండలాల్లో నెలకొన్న సమస్యలపై చర్చిస్తున్న అన్నివర్గాల ఆత్మబందువు,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆపద్బాంధవులు,ప్రియత నేత ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవ శ్రీ ఆత్రం.సక్కు గారు.ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతలలో
విద్య ,వైద్యం,వ్యవసాయం,
సీజనల్ వ్యాధులపై పలు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించలన్నారు.అలాగే నిన్న  నార్నూర్,గాదిగూడా మండలాలలో ఆకస్మికంగా పర్యటించి సమస్యలపై అరా తీశారు.మండలాలలో పలు గ్రామాల్లో రోడ్లు,ఆశ్రమ పాఠశాలలలో నెలకొన్న త్రాగునీళ్ల సమస్యలపై మరియు (అన్నదాత) రైతుబంధు సమస్యలపై చర్చించడం జరిగింది. అలాగే ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యలపై మరియు ఆదివాసీల సమస్యలపై కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.వారు ఈ విషయాలపై సానుకులంగా స్పందించి అతి త్వరలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

Wednesday, July 3, 2019

భారతీయ అటవీ చట్టం 1927- సవరణలు

భారతీయ అటవీ చట్టం 1927- సవరణలు ఎందుకోసం?

     వలస కాలంలోనే మన ప్రభుత్వాలు అడవిని లాభదాయక వనరుగా పరిగణించాయి. 'భారతీయ అటవీ చట్టం-1927' అడవిని స్థిరీకరించి, అటవీ ఉత్పత్తుల రవాణా, కలప, ఇతర ఉత్పత్తులపై పన్ను విధించేందుకు చట్టం రూపొందించింది. రక్షణ, రవాణా, రాబడి ఈ మూడు అంశాలనే శాసన పీఠికలో పేర్కొన్నారు.
  గత మార్చిలో అటవీ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ, ఫారెస్టు పాలసీ డివిజన్‌ వారు ఈ చట్టానికి పలు సవరణలు ప్రతిపాదిస్తూ చర్చకు ముసాయిదా విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌.జి.వోలతోనూ, అడవితో సంబంధమున్న వారందరిని పిలిచి ఈ సవరణలపై చర్చించి సూచనలు పంపమని కేంద్రం కోరింది.
*సవరించదలచిన 'పీఠిక' ఏం చెపుతోంది?*
     ఉపోద్ఘాతంలో పై మూడు లక్ష్యాలతోపాటు మరికొన్ని జోడించారు. అవి ఏమంటే 1) అడవుల పరిరక్షణ, అటవీ వనరులను క్రమబద్దంగా నిర్వహించటం వాటిని పరిపుష్టి కలిగించటం, 2) పర్యావరణ సమతుల్యతను (స్థిరత్వం) కాపాడటం, వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి వుంటూ పర్యావరణ వ్యవస్థల సేవలను నిరంతరాయంగా కొనసాగించటం, 3) ప్రజలు ప్రత్యేకంగా అడవిపై ఆధారపడిన ప్రజల సంక్షేమం, 4) జాతీయ అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చటం, 5) అటవీ ఆధారిత సాంప్రదాయ జ్ఞానం బలపర్చటం మద్దతు తెలపటం.
పర్యావరణ సమస్యలకు విశ్వవ్యాపిత స్వభావం వుంటుంది. అందుకే దేశంలో అడవులను వాటిలోని జీవావరణాన్ని కాపాడే చట్టాలు వున్నాయి. 'వన్యమృగ సంరక్షణా చట్టం 1972, అటవీ పర్యావరణ పరిరక్షణాచట్టం-1980, విపత్తుల నిర్వహణా చట్టం' లాంటివి ఉన్నాయి.
  ఈ చట్టాలను అమలు చేసి అడవిని రక్షించవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు. అది చేయకుండా వలస కాలం నాటి చట్టాన్ని సవరణల పేరుతో ఎందుకు ప్రభుత్వం మార్చాలంటుందో అర్థం కాదు. ఈ చట్టాలు పుట్టక ముందే అడవులలో ప్రజలు నివసించేవారు. అడవులను వర్గీకరించేటప్పుడు వారి నివాస ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాన్ని 'రక్షిత (ప్రభుత్వ) అడవులు'గా ప్రకటించేవారు. మన దేశానికి ఆక్రమణదారులుగా వచ్చిన బ్రిటీష్‌ వారు ఆదివాసుల్ని ఆక్రమణదారులన్నారు. నేటి మన పాలకులు అడవిని నమ్ముకుని బతుకుతున్న వారిని ఆక్రమణదారులంటున్నారు(సెక్షన్‌-2(41) నిర్వచనాలు). అలాగే సెక్షన్‌-2(3), సెక్షన్‌-2(4) లలో నిర్వచించిన 'కమ్యూనిటీ', 'విలేజ్‌ ఫారెస్టు' ఆశ్చర్యకరంగా, గత చట్టాలు చెప్పిన వాటికి విరుద్ధంగా వున్నాయి. కమ్యూనిటీ అంటే జాతి, మతం, కులం, భాష మరియు సంస్కృతితో సంబంధం లేనిదట! 'విలేజ్‌ ఫారెస్టు' ప్రభుత్వానిదట! గత చట్టాలలో లేని ఒక కొత్త వర్గీకరణను ఈ సవరణ చట్టం ప్రతిపాదిస్తోంది. అదే 'ఉత్పత్తి అడవులు' సెక్షన్‌-2 (10), సెక్షన్‌ 34(సి) (1) చెప్పేదేమంటే దేశంలో అటవీ ఉత్పత్తులను (నాణ్యత, ఉత్పాదకత) పెంచాలంటే ఉత్పత్తిదారులైన కార్పొరేట్‌ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టాలి.
  సెక్షన్‌ 80(ఎ) ప్రయివేటు అడవులను ప్రోత్సహిస్తోంది. ప్రకృతి ఆధారిత టూరిజం పేరుతో ప్రయివేటు కంపెనీలను ఆహ్వానించటం ఎవరి అభివృద్ధికి?
*ఆదివాసుల హక్కుల హరణ*
*మరో చారిత్రక అన్యాయమే*
     గిరిజనులున్న అటవీ ప్రాంతాలలో అటవీ అభివృద్ధి పేరుతో రకరకాల పథకాలు, కార్యాచరణ ప్రణాళికలు నడుస్తున్నాయి. ఇవన్నీ ఉదారవాద ఆర్థిక విధానాలతో, విదేశీ అప్పులతో మొదలయ్యాయి. వన సంరక్షణ సమితి (విఎస్‌ఎస్‌), జాయింట్‌ ఫారెస్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (జెఎఫ్‌ఆర్‌సి) లాభాలు పంచి ఆదాయాలు పెంచలేదు. అవినీతికి నిలువెత్తు నిదర్శనాలైన సెక్షన్‌-28 1(ఎ),(బి),(సి),(ఇ),(ఎఫ్‌) ప్రకారం వాటిని స్థానిక సంస్థలతో సమాన గుర్తింపు ఇస్తారట. 'పీసా' చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామ సభలను కేవలం సంప్రదిస్తారట. ప్రతిపాదించబడిన సవరణ చట్టం 'పీసా' చట్టాన్ని కాని, 'అటవీ హక్కుల చట్టం-2006'ను గాని గుర్తించినట్లులేదు.
గిరిజన తెగలకు ఇతర అటవీ నివాసులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేస్తూ భారత పార్లమెంట్‌ చేసిన చట్టం 'అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ)'. ఏమిటా చారిత్రక అన్యాయం? అది గిరిజనుల హక్కులకు సంబంధించింది. వలస చట్టాలు, స్వాతంత్య్రం తర్వాత చట్టాలు. ఉదాహరణకు 1967 ఎ.పి అటవీ చట్టం సెటిల్‌మెంట్‌ అధికారులను నియమించమని, వారి హక్కులను గుర్తించమని చెప్పాయి. అయినా పాలకులు పట్టించుకోలేదు. పోడు చేసి బతకటం ఒక అటవీ నేరంగా పరిగణించబడి జైలు శిక్షలు, జరిమానాలతో నానా ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఎ.పిలో పోడు పునరావాసం పేరుతో సాగుదారుడికి రూ.25 వేలు ఇస్తామని భూమి లాక్కున్నారు. డబ్బులు ఇవ్వలేదు. ఈ స్థితిలో 2006 లో వామపక్షాల మద్దతుతో గెలిచిన యు.పి.ఎ-1 ప్రభుత్వం ఈ చట్టం చేసింది. పోడు హక్కును గుర్తించి కుటుంబానికి 10 ఎకరాల వరకు పట్టా ఇవ్వడం గ్రామాలను రెవిన్యూ గ్రామాలుగా గుర్తించటం, ఉమ్మడి హక్కులుగా రోడ్లు, మేపుభూమి, స్మశాన భూములు కేటాయించాలంది. పర్యావరణ పరిరక్షణకు గిరిజనులను అడవుల నుండి నెట్టి వేయరాదని చట్టం చెప్పినా, దీన్ని అమలు చేయలేదు. ఈ సవరణ చట్టం సెక్షన్‌-10 ఇప్పుడు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లను నియమించమంటోంది. అంటే ఏమిటి? 2006 అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించలేదని ధృవపడుతోంది. ఎఫ్‌ఆర్‌ఎ చట్టంలో లబ్ధిదారుల గుర్తింపు, పట్టాల పంపిణీకి ఎఫ్‌ఆర్‌ఎ కమిటీ ద్వారా జరగాలి. కాని ఈ చట్టం మళ్ళీ ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లకు అప్పగించటం దేన్ని సూచిస్తుంది? డిపార్టుమెంట్‌ పెత్తనాన్ని కాదా?
  2013 ఎల్‌ఎఆర్‌ఆర్‌ చట్టం అమలులో వుండగా ఈ పాత చట్టంలో (అంటే 1894 చట్టం) సవరణలు అవసరమా? సెక్షన్‌ 11(1),(2),(3),(4) ప్రతిపాదిత సవరణలు చాలా అసందర్భంగా వున్నాయి. అటవీ భూములను అటవీయేతర పనులకు (ప్రాజెక్టులు, మైనింగ్‌ కార్యకలాపాలు) బదిలీ చేయటానికి సంబంధించి 1980 అటవీ పర్యావరణ చట్టం, తదనంతర మార్గదర్శకాలు చాలా నిర్దిష్టంగా వున్నాయి. వాటిని అమలు చేయకుండా పాత చట్టాలకు సవరణలు ఎవరి ప్రయోజనాల కోసం? కార్పొరేట్‌ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టటానికా ఈ తాపత్రయం?
*ఈ సవరణకు అర్థం ఏంటి?*
     ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చిన ఐదేళ్లలో పోడు సాగు అంతం కావాలట. సెక్షన్‌ 10(3)(ఎ), సెక్షన్‌ 20(1)(సి) ప్రకారం పోడు సాగు ఐదేళ్ల తర్వాత యథావిధిగా అటవీ నేరంగా పరిగణిస్తారన్నమాట. ఉన్న చట్టాన్ని అమలు చేసి భూములు ఇవ్వ నిరాకరిస్తున్న ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మరో చారిత్రక అన్యాయానికి సిద్ధపడటం కాదా?
*అటవీ నేరాలు-శిక్షలు*
     1927 చట్టంలో అటవీ నేరాలపై కేసులు పెట్టే అధికారం కేవలం ఫారెస్టు-పోలీసు అధికారులకే వుండేది. ఇప్పుడు సవరణ చట్టంలో రెవిన్యూ అధికారికి కూడా సెక్షన్‌ 52(1) ద్వారా ఈ అధికారం సంక్రమిస్తుంది. కేవలం అనుమానం ప్రాతిపదికగా ఎలాంటి వారెంట్‌ లేదా నోటీసు లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు. సెక్షన్‌ 64(1) (ఎ) (బి) (సి), (2) ఆ అధికారం ఇస్తున్నాయి. ఫారెస్టు రేంజరుకే నేరాలు పరిశోధించే అధికారం, సెక్షన్‌-190 సి.ఆర్‌.పి.సి ప్రొసీజర్‌ 1973 వినియోగించే అధికారం సెక్షన్‌ 64 (బి),(సి) ఇస్తున్నాయి.
అటవీ నేరాలను మైనర్‌-మేజర్‌ నేరాలుగా విభజించటం సెక్షన్‌ 64(4) ద్వారా లభిస్తుంది. అటవీ భూమికి సంబంధించినవి మేజర్‌ నేరాలుగా పరిగణిస్తారు.
  అటవీ హక్కుల చట్టం-2006 సెక్షన్‌-3, సబ్‌ సెక్షన్‌(1) క్లాజు (సి) ప్రకారం తేలిక పాటి అటవీ ఉత్పత్తులు సేకరించు కోవటానికి, కలిగివుండటానికి, రవాణా చేసుకోవటానికి, అమ్ముకోవటానికి ఆదివాసులు, ఇతర అటవీ నివాసులకు హక్కు వుంది. కాని ప్రస్తుత సవరణ చట్టం సెక్షన్‌ 2(3),(ఎ) ప్రకారం అటవీ ఉత్పత్తులు సేకరించటం, కలిగి వుండటం, రవాణా, అమ్మటం అటవీ నేరాలుగా పరిగణిస్తారు. అంటే ఇప్పటి వరకు గిరిజనులు ఉచితంగా సేకరించిన పలు ఉత్పత్తులు, ఇప్పుడు అటవీ నేరాలవుతాయి. మన విశాఖ ఏజన్సీలో అడ్డాకుల సేకరణ, తునికాకు సేకరణ, కొండ రెడ్లు సేకరించిన తేనె ఎవరైనా కలిగి వుంటే అటవీ నేరమౌతుంది. ఈ సవరణ చట్టం సెక్షన్‌ 78(1) ప్రకారం 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల జుల్మానా విధిస్తారు. ఇది 1927 చట్టంలో ఒక నెల జైలు, రూ.500 జరిమానాగా వుంది.
  ఈ చట్టం సెక్షన్‌ 78(1) (ఎ) ప్రకారం, సెక్షన్‌ 26లో పేర్కొన్న నేరాలు అంటే తాజాగా పోడు కోసం చెట్లు నరకడం, అడవిలో అగ్ని రాజేయటం, పశువులు మేపటం, చేపలు పట్టడం లాంటి నిషేధిత పనులు చేస్తే మొదటి దఫా శిక్షగా మూడేళ్లు జైలు శిక్ష లేదా రూ.5-50 వేలు జరిమానా లేదా రెండూ కలిపి కూడా విధించవచ్చు. ఇదే నేరాలు రెండోసారి చేస్తే ఒక సంవత్సరం కఠిన జైలు శిక్ష, జరిమానా గరిష్టంగా రూ.2 లక్షల వరకు విధించవచ్చు.
*ప్రయివేటు అడవులకు అనుమతి*
     ఈ సవరణ చట్టం సెక్షన్‌-80, 80(ఎ) ప్రకారం ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు, కంపెనీలకు పనికిరాని అటవీ భూములను ఇచ్చి, మేలైన అటవీ ముడి సరుకులు తయారు చేసుకునే అవకాశం ఇస్తారట. ఇవి సంయుక్తంగా కూడా నిర్వహించవచ్చునట. దీని కోసం జాతీయ ఫారెస్టు రీబోర్డు (సెక్షన్‌ (1), (2), (3), (4)) ఏర్పాటు చేస్తారట. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.
భారతీయ అడవుల చట్టం-1927కి ప్రతిపాదించిన సవరణలు అడవి మీద ఆధారపడి జీవించే ప్రజలకు వ్యతిరేకంగా వున్నాయి. చట్టం పీఠికలో వారి సంక్షేమం కోసం సవరణ చేస్తున్నట్లు చెప్పి, వారి ఉనికినే ప్రశ్నార్ధకం చేసే సవరణలు ప్రతిపాదించారు. వీటిని పూర్తిగా పున:పరిశీలన చేయాలని, ఉపసంహరించాలని కోరుతూ ఉద్యమించవలసిన తక్షణ కర్తవ్యం మన ముందు వున్నది.

- డా|| మిడియం బాబూరావు (వ్యాసకర్త మాజీ ఎం.పి, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ చైర్మన్‌)

Gondwana Kabur