Followers

Tuesday, April 14, 2026

వాల్గొండ గ్రామంలో వరకట్నం నిషేధం వరుడికి ఆర్థిక సహాయం

ఇంద్రవెల్లి మండలం వాల్గొండ గ్రామంలో వరకట్నం, కానుకలు నిర్మూలనకు గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా నిలుస్తోంది. గత సంవత్సరంలో “కట్న కానుకలు వద్దు – సహాయం చేయడం ముద్దు” అనే తీర్మానాన్ని గ్రామ పెద్దలు తీసుకోగా, అదే నిర్ణయాన్ని ఈ సంవత్సరం కూడా గ్రామస్తులు కట్టుబడి అమలు చేశారు.
  ఈ క్రమంలో ఉయిక విజ్జుబాయి, మనిక్ రావ్ కుమారుడు పరమేశ్వర్ వివాహ సందర్భంగా గ్రామస్తులంతా ఒక్కటై వివాహ కుటుంబానికి ఆర్థిక సహాయంగా మొత్తం రూ.24,000 (ఇరువై నాలుగు వేల) రూపాయలు సేకరించి అందజేయడం జరిగింది.
   ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ కినక మనిక్ రావ్, కినక శంభు దేవారి, కినక లచ్చు పటేల్, కినక జుగదిరావ్ సర్పంచ్, కోట్నాక్ సంతోష్, కినక పకృ, మహిళలు, యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

Sunday, March 29, 2026

ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధన రగల్ జెండా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

•ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20 తేది వరకు ఏజెన్సీ రక్షణకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామన్న ఆదివాసి సంఘాలు.
 
•ఈరోజు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆదివాసి సంఘాలు మరియు గోండ్వాన పంచాయితీ రాయి సెంటర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఏప్రిల్ 20న అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరియు 1వ తేదీ నుండి 20 తేది వరకు ఏజెన్సీ రక్షణ కోసం రిలే నిరాహార దీక్షలు చేయాలనీ ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో తీర్మానించడం జరిగింది. 

•అమరవీరుల ఆశయ సాధన కమిటీ కమిటీని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కమిటీ చైర్మన్ గా మేస్రం నాగ్ నాథ్, గౌరవాధ్యక్షులుగా తొడసం నాగరావ్, ప్రధాన కార్యదర్శిగా కనక తుల్సిరాం, ఉపాధ్యక్షులు సోయం రాందాస్, జై రామ్,  కార్యదర్శిగా గేడం భారత్, తొడసం హన్మంతు, సంయుక్త కార్యదర్శిగా కనక హనుమంతరావు, సలహాదారులుగా తొడసం అమృత్ రావు, మెస్రం వెంకట్రావు, మెస్రం దుర్గు, కొట్నాక్ దేవ్ సావ్, పేందర్ దాదిరావ్ లను ఎన్నుకున్నారు.
 •ఈ కార్యక్రమంలో ఆదివాసక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గోడం గణేష్, పుర్క బాపూరావ్, జిల్లా సార్మేడి తొడసం అమృత్ రావ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పెందుర్ దాదిరావ్, సర్మేడీలు మెస్రం వెంకట్ రావ్, మెస్రం దుర్గు, కొట్నాక్ దేవ్ సావ్, గొండ్వాన వెల్ఫేర్ సొసైటి అధ్యక్షులు ఆడ హన్మంత్ రావ్, తుడుం దెబ్బ ఇంద్రవెల్లి అధ్యక్షులు పుర్క చిత్రు, ఖమ్ము జూగ్నక్ భరత్ ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జన్మనిచ్చిన అమ్మతో సమానం.!

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అనే సంఘము యావత్ ఆదివాసి సమాజానికి జన్మనిచ్చిన అమ్మతో సమానం ఇది జగమెరిగిన సత్యం. 

ఉద్యమ నాయకుల్లారా మీకు పాదాభివందనాలు. మీరు ఉద్యమాలు చేస్తున్న తరుణంలో అనేక కష్టాలు నష్టాలు భరిస్తున్న సందర్భాలను చూస్తూ ఉంటే మీకు సెల్యూట్. మీరు నిరంతరం సమాజం కోసం సూర్యుడిలా వెళ్తురు ఇస్తూ ముందుకు సాగాలి.

 సంఘంలో సమాజంలో ఒక హోదాలో ఉండి వ్యక్తిగత పనుల కోసం సంఘాన్ని వాడుకొని సంఘం పేరును చెడుగా సమాజానికి పరిచయం చేయకండి.

 సంఘం పేరు చెబుతూ సమాజం సమాజంలో మంచి హోదాలో ఉండి కొందరు స్వార్థ స్వలాభం కోసం సంఘాన్ని వాడుకొని సంఘమే అలాంటిది అనే ధోరణిలో సమాజం ఎత్తిచూపే పరిస్థితి తీసుకు వస్తున్నారు. అలాంటివారు ఆత్మ విమర్శన చేసి భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసే బాధ్యత మీపై ఉంది. సంఘ పెద్దలపై కూడా ఉంది. ఇది యావత్ సమాజం ఆలోచన ఆవేదన ఆత్మా విమర్శన చేయండి సమాజ వేదికను కాపాడండి తుడుం దెబ్బ ఒక అమ్మలా భావించండి.

Monday, March 16, 2026

అనాధ పిల్లలకు అభిమన్యు వాట్సాప్ గ్రూప్ ఆత్మీయ సహాయం

•90,500(తొంబై వేల ఐదు వందల) రూపాయలు సహాయం చేసి మానవత్వం చాటుకున్న వాట్సాప్ గ్రూప్ 

 ఇటీవల తల్లిదండ్రులు చనిపోవడంతో  అనాదలైన పిల్లలకు అభిమన్యు వాట్సాప్ గ్రూప్ అండగా నిలిచింది. ఉట్నూర్ మండలం రాంజీ గోండ్ నగర్ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయి ఎనిమిది రోజుల పసికందును జన్మనిచ్చి  అకాల మరణం చెందింది. తండ్రి విట్టల్ కూడా గత నాలుగు నెలల క్రితం చనిపోయాడు. దీనితో మూడు సంవత్సరాల కొడుకు, 8 రోజుల పసిగుడ్డు అనాధలయ్యారు. దీనితో అభిమన్యు గ్రూప్ ద్వారా అనాద పిల్లలను ఆదుకోండి అనే శీర్షికతో  దాతలు ముందుకు వచ్చారు దాతలు 90,500 (తొంబై వేల ఐదు వందల) రూపాయలు జమ అవ్వగా గ్రూప్ సభ్యులు మెస్రం శేఖర్ బాబు ఆధ్వర్యంలో రాంజీ గోండ్ నగర్ వెళ్లి చిన్నారులకు అందచేసారు. నానమ్మ పసి కందు పేరిట ఫిక్స్ డిపాజిట్ చేయాలనీ సూచించారు. ఇలా సహాయం చేసిన అభిమన్యు గ్రూప్ నీ ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మర్సుకొల తిరుపతి, మెస్రం లింగు,  కుమ్ర వెంకట రమణ, మడవి నాగుబాయి, అర్క ఇందిరా, మడవి రత్నమాల, ఆత్రం రంభ, బండి విజయ్, సలాం దేవ్ రావు, మెస్రం దేవ్ రావ్, ఆత్రం తిరుపతి, మర్సుకొల సురేందర్, జాదవ్ రంజిత్, మెస్రం జగన్, పెందుర్ సంతోస్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, March 14, 2026

మాంజిరి గ్రామస్థుల వధువుకు ఆర్థిక సహాయం

     ఆదివాసులు ఆడపిల్ల పెండ్లికి వరకట్నం నిషేధించాలనే ఉద్దేశంతో చెయి చెయి కలపి వధువుకు ఆర్థికంగా తోచిన విధంగా సాయం చేస్తున్నారు. నార్నూర్ మండలంలోని మాంజిరి గ్రామానికి చెందిన కొడప మారుతీ, అంబుబాయి కూతురు కొడప జంగుబాయి వధువుకి గ్రామస్తులు పటేల్ ఆధ్వర్యంలో గ్రామ పటేల్ ఇంటి ముందురా ప్రతి ఇంటికి 300 వందల రూపాయలు చొప్పున జామా చేసిన వదువుకు 19,051 రూపాయలు   గ్రామ పటేల్ పెందోర్ మనోహర్, దేవరీ మాడావి షేకు, మహాజన్ మాడావి లచ్చు, జై శ్రీ రాం యూత్ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో వధువుకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ పెందోర్ మనోహర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిందని ప్రస్తుతం తరుణంలో ఆడపిల్లల పెండ్లిలు భారంగా కాకుండాదనే ఉద్దేశంతో గ్రామస్తులు ఐక్యంగా ఉండి ప్రతి ఇంటికి 300 వందల చొప్పున డబ్బులను జామ చేయడం జరిగిందన్నారు. జామ చేసిన డబ్బులను పెండ్లి కూతురుకు అందించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు మరియూ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.