సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం ఉంటే ఎలాంటి కష్టమైనా సులభంగా అధిగమించవచ్చని చెప్పే మంచి నిదర్శనం సాలెవాడా (బి) గ్రామస్తులు. పెందోర్ నాగోరావు కుమారుడు మారుతి, పేద కుటుంబానికి చెందిన వివాహాలకు ఒక వరం లాంటిది.
కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఒక ముఖ్యమైన బాధ్యతగా భావించబడుతుంది. అలాంటి సందర్భంలో సాలెవాడా (బి) గ్రామస్తులు చూపించిన ఐక్యత, సహకారం నిజంగా ప్రశంసనీయమైనది.
ఆ కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నదని గుర్తించిన గ్రామస్తులు అందరూ కలిసి ముందుకు వచ్చి, వివాహం సజావుగా జరగడానికి తమవంతు సహాయాన్ని అందించారు. గ్రామంలోని పెద్దలు, యువకులు, మహిళలు ఇలా అందరూ కలిసి కట్నకానుకలతో పాటు ₹20,100 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ సహాయం ఆ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది.
ఒక్కరి సమస్యను అందరూ తమ సమస్యగా భావించి ముందుకు వచ్చి సహాయం చేయడం మన సంస్కృతిని, భావితరాలకు అందించడం గొప్ప ఐక్యతను స్పష్టంగా చూపిస్తుంది. సమాజంలో పరస్పర సహకారం ఉంటే ఎలాంటి కష్టమైన పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొనవచ్చని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.
ఈ సందర్భంగా పేద కుటుంబానికి అండగా నిలిచి, ఆర్థిక సహాయం అందించిన సాలెవాడా బి గ్రామస్తులందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమంలో, మరప బాజీరావు పటేల్, మరప నాగరావు పటేల్, దేవరి మరప షేకు, పేందర్ జగన్నాథరావు, మెస్రం కోసేరావు, సోయం హనుమంతు, ఆడా రామారావు, మడావి రాజు, నైతం మనోహర్, ఆత్రం పురుషోత్తం, గ్రామపంచాయతీ సర్పంచ్ మెస్రం రాధాబాయి నాగోరావ్ ఎప్పటికీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!