ఆదివాసులు ఆడపిల్ల పెండ్లి వరకట్నం నిషేధించాలనే ఉద్దేశంతో చెయ్యి చెయ్యి కలపి వధువుకు ఆర్థికంగా తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని వడగం గ్రామానికి చెందిన వధువు మెస్రం పునేషశ్వరికి గ్రామస్తులు ఆధ్వర్యంలో గ్రామ పటేల్ ఇంటి ముందున్న ప్రతి ఇంటికి చొప్పున జామా చేసిన 21,800 రూపాయలను గ్రామ పటేల్ ఆత్రం మారుతి, దేవరి ఆత్రం ధర్ము, మహాజన్ మెస్రం జాకు, శ్రీ వెంకటేశ్వర యూత్ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో వధువుకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ ఆత్రం మారుతి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిందని ప్రస్తుతం తరుణంలో ఆడపిల్లల పెండ్లిలు భారంగా కాకుండాదనే ఉద్దేశంతో గ్రామస్తులు ఐక్యంగా ఉండి ప్రతి ఇంటికి 200 వందల చొప్పున డబ్బులను జామ చేయడం జరిగిందన్నారు. జామ చేసిన డబ్బులను పెండ్లి కూతురుకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!