ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు రావణాసురుని వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది.
ఈ సభలో రాష్ట్ర కన్వినర్ బండి కిరణ్ మాట్లాడుతూ" మన మూలవాసులు అయిన ఆదివాసులను రాక్షసులు గా చిత్రీకరించి ఈ రోజు పండగలు చేసుకుంటున్నారు.
మనం గుర్తుంచు కోవలసిన విషయం రావణుడు చేసిన తప్పు ఏమిటి..?
రావణుడి చరిత్రను మనువాదులు వాళ్లకు అనుకూలంగా రాసారు. మనువాదులారా ఈ రోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్న ఒక మనిషి చనిపోతే ప్రతి ఏటా సంబరంగా పండుగలా చిత్రీకరించి కాల్చడం ఏమిటి..?
అంబేద్కర్ పూలే యువజన సంఘం నుంచి ఒక్కటే చెప్తున్నాం మా మూలవాసులు అయిన ఆదివాసులను రాక్షసులు గా చిత్రీకరించి జరుపుతున్న ప్రతీ పండగలను అడ్డుకుంటాం. మా మూలవాసుల వర్ధంతులను జరుపుతాం గ్రామా గ్రామానా జరుపుతాం " అని మాట్లాడటం జరిగింది.
ఈ వర్ధంతి సభ కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి మట్లాడుతూ " రావణుడు రాక్షసుడు కాడు ఈరోజు
చరిత్రను తప్పుడు రాతలు రాసి రావణుడిని రాక్షసుడిగా చిత్రీకరించి పండగలు జరుపుతున్నారు " అని అన్నారు.
అలగే ఈ సభలో పాల్గొన్నవారు
బుడగ జంగాల సంఘం రామ్ బాబు ,
APYS కల్చరల్ వింగ్ కో కన్వీనర్ గణేష్,
APYS HYD కన్వినర్ మంతురి ఆంజనేయులు , సిద్దిపేట జిల్లా కన్వినర్ సోమీ వంశి ,
కో కన్వినర్ S రాజు ,
రంగారెడ్డి జిల్లా కన్వీనర్ వెంకటేష్ , శ్రీకాంత్ , ప్రసాద్ , ప్రకాష్ , నరేష్ , రవి కిరణ్ , మనీ తదితరులు పాల్గొన్నారు.
జై రావణాసురా
జైజై రావణాసురా...
- అంబేద్కర్ పూలే యువజన సంఘం రాష్ట్ర కమిటీ.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!