Followers

Monday, September 16, 2019

ఆదివాసులంతా ఏకమై ఉద్యమించాలి. -కేసిఆర్


నిజమే దొర మీరు చెప్పినట్లే ఆదివాసులంతా చైతన్యమై , పార్టీలు,సంఘాల కతీతంగా పిడికిలి బిగించి, నాటి కాకతీయ చక్రవర్తులపై సమరశంఖం పూరించి ఆదివాసుల ఆత్మాబిమానాన్ని ,పౌరుషాన్ని చూపిన సమ్మక్క సారక్కల స్పూర్తితో,  తర్వాత  ప్రపంచాన్ని గడగడలాడించిన బ్రిటీష్ పాలకులపై  తొలి తుడుం మోగించిన ఆదివాసి పోరాట వీరుల స్పూర్తితో, ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని అరాచకంగా  పరిపాలించిన నిజాం సర్కారును సైతం గడగడలాడించి జల్ జంగల్ జమీన్ పై హక్కుల సాధించిన కుమరం భీం దాదా పోరాట స్పూర్తితో, నేడు యావత్ ఆదివాసి సమాజం ఏకమై ఒకే జెండా, ఒకే నాయకత్వం,ఒకే డిమాండ్ తో “ చట్టబద్దత లేని లంబాడీలను ST జాబితా నుండి తొలగించడంతో “పాటు భారత రాజ్యాంగం ఆర్టికల్ 342 ప్రకారం గుర్తించిన నిజమైన ఆదివాసి తెగల ప్రయోజనాల కోసమే నిస్వార్దంగా, ప్రజాసామ్యయుతంగా”కళం,గళంతో” జాతి కోసం,జాతి చైతన్యం కోసం,జాతి ప్రయోజనాల కోసం,జాతి అస్థిత్వం కోసం ఆదివాసి ఉద్యమ నాయకుడు,కుమరం భీం పోరాట వారసుడు గౌరవనీయ పార్లమెంటు సభ్యులు శ్రీ సోయం బాపురావు దాదా గారి నాయకత్వంలో అవిశ్రాంతంగా పోరాడి చారిత్రాత్మక విజయం సాధించడం ఖాయం. మీరు చెప్పినట్లే  పోరాడుతున్న అమాయక ఆదివాసులకు మద్దతుగా మీ పాలన సాగాలని కోరుకుంటున్న యావత్ ఆదివాసి సమాజం. జై  ఆదివాసి.జైజై ఆదివాసి.

1 comment:

Thank you So Much for your Useful Suggestion..!!