కొలుకి కొత్త గుడ్డ కడితే విప్పపూలు కింద పడకుండా అందులో పడుతాయి..అప్పుడు వాటిని ఎండ బెట్టి జూన్ లేదా జులై నెలలో విత్తనం పండుగ (Seed festival) గ్రామదేవత అయిన ముత్యాలమ్మ దగ్గర చేస్తారు.అప్ప్పుడు నిండు చెంబులో నీళ్ల పెట్టి పూజారి వెనక్కు తిరిగి కూర్చొని ఒక్కొక్క కార్తె చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు నీళ్లలో వేస్తారు..ఏ పువ్వు అయితే నీళ్లలో మునుగుతదో ఆ కార్తెలో మంచిగ వర్షం పడుద్ది.లేకపోతే వాన పడదు..మన పూర్వీకులు ఈ పద్దతి ద్వారనే కాలాన్ని లెక్కించి ,ఏ కార్తెలో ఏ పంటలు వేయాలో దాన్ని బట్టి నిర్ణయించుకునేవారు.ఈ పద్ధతిలోనే ఆదివాసీలు కాలాన్ని లెక్కించేవారు...!



No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!