కుంరం భీం నూతన విగ్రహావిష్కరణ
ఆదివాసి పోరాట వీరుడు, అమర జీవి కుమ్రం భీమ్ నుాతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని కుమ్రం భీమ్ చౌక్ నందు తేది: 10/07/2023 సోమవారం రోజున సాయంత్రం 5 గంటలకి ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ కుమ్రం భీమ్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ వారి కొరెంజన్.
కావున సమస్త ఆదివాసి సమాజం తో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు పాల్గొనలని ఉత్సవ కమిటీ సాదర పుార్వకంగా ఆహ్వనిస్తోంది. విగ్రహ ఆవిష్కరణ ముఖ్య కార్యక్రమంకి ముందు డోల్క్, కాళికోం, పెప్రెంగ్ మరియు ఆదివాసి కళా ప్రదర్శనలతో 4 గంటలకి ర్యాలీ ప్రదర్శన మల్టీ పర్పస్ గ్రౌండ్ నుండి కుమ్రంభీమ్ చౌక్ వరకు నిర్వహించడం జరుగుతుందని విగ్రహ ఉత్సవ కమిటీ తెలుపుతున్నాము. ఆదివాసి సమాజ చిన్న, పెద్దలు, గ్రామ పటేల్, రాయ్ సెంటర్ సభ్యులు, సర్పంచులు, విద్యార్థులు, కుల సంఘాల మరియు రాజకీయ నాయకులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరు పాల్గొని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ కుమ్రం భీమ్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ మనవి.
జై కుమ్రం భీమ్ జై జై కుమ్రం భీమ్.!!
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.