గోడం రామారావు గారి సేవలు చిరస్మరణీయం
మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే గోడం రామారావు గారి 91వ జయంతి ఇచ్చోడలో ఘనంగా జరిగింది. గోడం రామారావు గారి తనయుడు మాజీ మంత్రివర్యులు గోడం నగేష్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గోడం రామారావు గారు చేసిన సేవలు మరువలేనివని మంత్రిగా ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేసిన ఘనత గోడం రామారావుకి దక్కుతుందని అన్నారు. ప్రత్యేకమైన జీవోలు తీసుకువచ్చి జిల్లాకు అనేక ఉద్యోగాలు కల్పించిన ఘనత రామారావుకే దక్కుతుందని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మనమందరం ముందుకు నడవాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు గోడం నగేష్, తాంసి జడ్పీటిసి తాటి పెళ్లి రాజు, బోథ్ ఎంపీపీ శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ మాజీ కమిషన్ సభ్యురాలు నీలాబాయి, మాజీ జడ్పీటిసి కనక తుకారాం, జీవ వైవిధ్య కమిటి సభ్యులు మర్సుకొల తిరుపతి, బిఆర్ఎస్ పార్టీ సభ్యురాలు సుమన్ బాబు, ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్ రావ్, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, గోడం రామారావు గారి వంశస్థులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!