చదువులకు పట్టాలు కావాలి
గూడెం చదుల్ని పట్టాల పైకి ఎక్కించండి పట్టాలు ఇప్పించండి.
పోడుకు పట్టాలొచ్చాయ్
చదువులకొద్దా...పట్టాలు..!!
గూడెం లో చదువు సచ్చిపోతోంది... ఇది గూడెం వినాశనానికి సంకేతమే.!
ఆదివాసి జాతి అంతం మొదలైంది.
ఆదివాసీల చదువుల పనైపోయింది... పసలేదు
పట్టింపు లేదు.
చదువులకు పట్టాలు లేవు.
పోడుకు పట్టాలొచ్చాయ్
మరి గూడెం పోరగాండ్ల చదువుల పట్టాల సంగతేంది...వద్దా..?
చదువులకు పట్టాలు లేకనే కదా...ఈ కట్టాలు..!
మన గూడెం లో చదువు రాని మోటు గొడ్డలి 10 ఎకరాల భూమికి పట్టా తెచ్చింది.
అన్నీ తెలుసని విర్రవీగిన కలం 20 ఏండ్ల చదువుకు పట్టా తేలేదు పట్టాభి షేకము లేదు.
ప్రతి గూడెం లో
చదువులకు పట్టాలు కావాలి.
NEET పట్టాలు
IIT పట్టాలు
IAS పట్టాలు
IPS పట్టాలు
ఎంసెట్ పట్టాలు
లాసెట్ పట్టాలు
ఉన్నత చదువులన్నింటికి పట్టాలు కావాలి కదా...
ప్రాణం లేని భూమికేనా పట్టా..
పేగు తెంచుకోని పుట్టిన నీ బిడ్డల చదువులకు పట్టాలు వద్దా.? వాళ్ళను ఉన్నతంగా చదివించడం...పట్టాలు ఇప్పించడం నీ బాధ్యత కాదా...ముమ్మాటికీ నీదే..!!
చైతన్యం సంకనాకుతోంది,
నిర్లక్ష్యం నిలువునా ముంచుతోంది,
అభివృద్ధి ముసుకులో అజ్ఞానం రాజ్యమేలుతోంది.
అహంకారపు అంధకార ముసలం పుట్టింది...ఇది అంతమే...ఖతం...సర్వం హతం...!!
చదువులకు పుట్టగతులు లేవు... ఇగ పుట్టేటోనికి పునాదులు లేవు. కండ్ల ముందున్న రిజర్వేషన్ల ను కావురమెక్కి కాళ్ళతో తన్నుకొని బొక్క బోర్ల పడింది జాతి.
ఎందుకో...తెలుసుకో..!!
తెలుసుకోని నీవు చేసేది కూడా ఏమి లేదు...అయినా తెలుసుకో..!!
ST కోటలో 20 MBBS సీట్లు ఉన్నప్పుడు నలుగురు ఆదివాసీలు డాక్టర్ లు అయ్యారు...ఆ తర్వాత DMHO లు కూడా అయ్యారు..దిగిపోయ్యారు.ఇది 40 ఏండ్ల కిందటి ముచ్చట.ఇంజినీర్లు కూడా గంతే.
నేడు MBBS లో
460+ govt కోటా
200+ ప్రైవేట్ కోటా
200+ సెంట్రల్ కోటా
ఇన్నిన్ని సీట్లు ఉన్నప్పుడు ఒక్కరు కూడా డాక్టర్ లు కాలేక పోతున్నారు...IIT/JEE...సివిల్స్...మిగతా కోర్సు ల సంగతి కూడా ఆంతే...ఏమై పోతోంది ఆదివాసీ సమాజం..?
ఎందుకని ఒక్కరు కూడా డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్ లు కాలేక పోతున్నారు.
ఈ జాతి నిజంగానే ఎడ్డిదై పోయిందా...?
రిజర్వేషన్ శాతం పెరిగింది,
సీట్లు పెరిగాయి,
చైతన్యం పెరిగింది,
సమాచారం పెరిగింది,
సౌకర్యాలు పెరిగాయి.
కానీ
ఆదివాసీల వాటా పెరగలేదు,
కోటా పెరగలేదు,
కనీసం neet ,ఐఐటీ,సివిల్స్ కు apply కూడా చేసుకోలేని దౌర్భాగ్యపు నిర్లక్ష్యాన్ని పెంచి పోషిస్తున్నదేవరు.? ఈ ఎడ్డీ మా లోకాన్ని బాగుపరిచేది ఎవరు.? ఈ నిర్లక్ష్యం ధోరణిని పెంచుతున్నదేవరు.
Neet, ఐఐటీ,సివిల్స్
ఒక్కసారి రాస్తే...సీట్ వచ్చే కాలం పోయింది.
సీట్ వచ్చే వరకు exam రాసే కాలమొచ్చింది.
కానీ
మనోళ్లు apply కూడా చేసుకోవడం లేదంటే చదువుల చైతన్యం ఎక్కడ సంకనాకి పోతోంది. పోనీ ఉద్యోగులకేమి మాయరోగమొచ్చింది ఉన్నోళ్లకేమి పాడు రోగమొచ్చింది. చేజేతుల తమ పిల్లలు చదువుల్ని తామే చిదిమేస్తున్నారు.
ఈ ఎడ్డీ నిర్లక్ష్యం ఎవ్వరిది.
Bipc గ్రూవు తీసుకోని ఎంసెట్ రాస్తే mbbs సీట్ వచ్చే కాలం పోయి, mpc కూడా గంతే, సివిల్స్ కూడా అంతే
నారాయణ,శ్రీచైతన్య ,ఆకాష్,
allen etc... కాలేజీ లలో చదివి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటేనే సీట్ వచ్చే కాలమొచ్చింది. కాని ఆదివాసీలు చదువులను నిర్లక్ష్యం చేసుకోని పిల్లల గొంతు కొస్తూ, చదువులను చిదిమేస్తున్నారు. ఉన్న టేర్మ్ లను ఉపయోగించు కోవడమే తెలియదు. లాంగ్ టర్మ్ వైపేవ్వడూ చూసిండు. అవకాశం ఉన్నోళ్లు కూడా చదివించడం లేదంటే ఈ ఎడ్డీ చైతన్యం ఎవ్వరిది..?
460 mbbs సీట్లు
5000 ఐదు వేల ఇంజినీరింగ్ సీట్లు రాష్ట్ర ,దేశవ్యాప్తంగా ఉన్నా అన్ని యూనివర్సిటీ లలోని వేలాది టెక్నికల్ నాన్ టెక్నికల్ సీట్లు ఏకపక్షంగా వాళ్లకు పోతుంటే. అవకాశమున్నోళ్లు కూడా తమ పిల్లల్ని చదివించుకోకపోతే ఈ ఎడ్డీ సమాజాన్ని బాగుచేసేది ఎవ్వరూ....?
అయ్యా ...ఆఖరికి ఉచ్ఛిత neet,సివిల్స్ఐటీబీ కోచింగ్ కు కూడా apply చేసుకోవడం లేదు. పోనీ ప్రతి ITDA పరిధిలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే తెలివి లేదు. చదువుల మీద ఆలోచన లేదు. ఇంత అద్వాన్నపు బరి తెగింపు నిర్లక్ష్యంలో మునిగి తేలుతూ తీరుకో జెండా ఎత్తుతారు. రోజుకో పోరాట మంటారు. చదువుకూడా పోరాటమే కదయ్యా కాసేపు పచ్చడి నాకుడు ఆపి ఆలోచించమని అడుగుతోంది గిరిజాబాయి మన గిరిరాజు నాకింది నెమరేసుకుంటూ నీళ్ళు నములుతూ కండ్లు బైర్లు కమ్మి నెత్తి గోకుకుంటూ నేలవంక...!!చూస్తున్నాడే గాని సమాధానం మాత్రం చెప్పడం లేదు చెప్పడు పెగ్గేసుడు పచ్చడి నాకుడు తప్పా పిల్లల చదువుల మీదా పట్టింపే లేదు సమాధానం రాదు. నౌకరోళ్ళు,పొలిటికలోళ్ళు,పోరాటపోళ్ళు,చదువుకున్నోళ్లు అందరూ పచ్చడి నాకుడుకే సరితూగుతున్నారు. చదువుల పట్టింపు ఎవ్వరికీ లేదు.? ఎవరి కడుపులో పుట్టినా గొప్ప చదువులకు అక్కరకు రాని చెత్తకుప్పల్ని చేజేతులా చేసుకుంటున్నారు పిల్లల్ని..
మీరైనా... చెప్పండి
ఆదివాసీ జాతికి ఏమైంది
ఇంత పిసిని గొట్టు...బరితెగింపు...అద్వాన్నపు...అంధకారపు నిర్లక్ష్యమా...అదీ తమ కడుపులో పుట్టిన పిల్లల చదువుల మీదా...!!
చదువులు లేకుండా
రిజర్వేషన్లు ఉండేమి లాభం
ఈ నిర్లక్ష్యం ఎవ్వరిది....ఓ తండ్రి ఈ నిర్లక్ష్యం...నీదే...ముమ్మాటికీ నీదే...నీవు పచ్చడి నాకుడు ఆపితే...పిల్లల చదువులు సాగుతాయి..!!
అమ్మయ్యా...పూర్తిగా చదివి నందుకు ధన్యవాదాలు
కనీసం...మీ కడుపున పుట్టిన పిల్లలనైనా... ఉన్నతంగా...చదివించండి..!!
మీ గూడెంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు సహకరించండి...లేదంటే హతం...ఖతం... భూస్థాపితం..!!
పోరాడి పోడుకు పట్టాలు సాదించినట్లే
పోరాగాండ్ల చదువులకు పట్టాలు ఇచ్చే పోరాటాన్ని భుజానికెత్తుకొండి..!!
గూడెం చదువుల్ని పట్టాల పైకి ఎక్కించండి..!!
జై సేవా..!!
జై ఆదివాసీ..!!
-Milky Adivasi