Followers

Monday, April 27, 2020

జీఓ నెం.3 పైన మానవ హక్కుల ఫోరం(HRF) ప్రకటన |Gondwana Channel|

జీఓ నెం.3 పైన మానవ హక్కుల ఫోరం(HRF) ప్రకటన

ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి షెడ్యూల్డ్ తెగలకు (ఎస్.టి.)  చెందిన వారికి ప్రభుత్వం కల్పించిన 100%  రిజర్వేషన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మానవ హక్కుల వేదిక (HRF ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  22 ఏప్రిల్ 2020న ఐదుగురు సభ్యులు గల సుప్రీం కోర్టు ధర్మసనం ఇచ్చిన ఈ తీర్పు ఆదివాసులు కష్టపడి సాధించుకున్న హక్కులకు విఘాతం కలిగిస్తుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఈ విధమైన రిజర్వేషన్ కల్పించడం అత్యంత న్యాయసమ్మతమైన, సహేతుకమైన చర్య మాత్రమే కాదు అది ముమ్మాటికీ రాజ్యాంగబద్ధమైన చర్య.  ఈ రిజర్వేషన్ రాజ్యాంగ పరిధిలోకి రాదని సుప్రీం కోర్టు భావించడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం.   షెడ్యూల్డ్ ప్రాంతాల్లో టీచర్ల పోస్టులకు ఎస్.టి. లకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ ఏ‌పి ప్రభుత్వం 2000లో జారీ చేసిన జీఓ 3 ప్రభుత్వ దుందుడుకు చర్య ఏమాత్రం కాదు.  ప్రభుత్వం ఏ సామాజిక, చారిత్రిక నేపథ్యంలో   ఈ జీ.ఓ.ను జారీ చేసినదో సుప్రీం కోర్టు అర్ధం చేసుకోలేదు. 
   
'రాజ్యాంగంలోని రాజ్యాంగo' గా భావించబడే రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ స్వరూపస్వభావాలు, ప్రాధాన్యతల పట్ల న్యాయమూర్తులకు కనీస అవగాహన లేదని ఆ 152 పేజీల తీర్పు చదివితే అనిపిస్తుంధి.  ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల ప్రత్యేక హోదాను ఈ తీర్పు మౌలికంగా ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది.  ఆదివాసులను కాపాడటం, వారి సంస్కృతిని కాపాడటం, వారికి స్వయం ప్రతిపత్తి కల్పించడం, వారు సాధికారత సాధించేందుకు వీలు కల్పించడం చాలా అవసరమని రాజ్యాంగకర్తలు భావించబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఒక షెడ్యూల్డ్ ప్రాంతం ఉండాలనే ఐదవ షెడ్యూల్ ఏర్పాటు చేశారు.  రాజ్యాంగ పీఠిక ప్రకటించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం సాకారం కావడానికి, ఆ ప్రాంతంలో శాంతి, సుపరిపాలన సాధించడానికి ఐదవ షెడ్యూల్ ఏర్పాటు  అవసరమని వారు గట్టిగా భావించారు.  సుప్రీం కోర్టు ఈ స్ఫూర్తిని అర్ధం చేసుకోలేదు.
   
      షెడ్యూల్డ్  ప్రాంతాల్లో స్థానిక ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించడం అంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రమైన 46వ అధికరణాన్ని అమలు చేయడమే.  ఈ అధికరణం ప్రకారం రాజ్యం బలహీనవర్గాల ప్రజల, అందునా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి ఆర్ధిక ప్రయోజనాలను కాపాడటం, వారికి విద్య అందుబాటులోకి తేవడం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.  వారిని అన్ని రకాల సామాజిక దోపిడీ-పీడనల నుండి కాపాడాలి. 

      షెడ్యూల్డ్ ప్రాంతాల్లో విద్యా సంస్థల పని తీరుని మెరుగుపరిచి, తద్వారా ఆదివాసులకు విద్యావకాశాలు కల్పించే లక్ష్యంతో  స్థానిక ఎస్.టి.లకు 100% రేజర్వేషన్లు కల్పించారు.  మారుమూల ప్రాంతాల్లోని బడులలో పరాకాష్టకు చేరుకున్న టీచర్ల గైర్హాజరీ సమస్యను ఎదుర్కొనడానికి, ఆ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ జి.ఓ. చాలా ఉపయోగపడింది.  టీచర్లు  స్థానిక ఆదివాసులే కాబట్టి గైర్హాజరీ సమస్యను పరిష్కరించగలిగారు. అందువల్ల ఆదివాసీ విద్యార్థుల విద్యా బోధన కూడా నిరాటంకంగా సాగింది.

      రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ లోని అంశాలను ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసులకు 100% రేజర్వేషన్లు కల్పిస్తూ 1986 మొదలు అనేక జి.ఓ.లు జారీ చేసింది.  ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి గల కారణం ఏమిటంటే ఆదివాసుల పట్ల ఏమాత్రం సానుభూతి  లేని ఆదివాసీయేతరులు ఆదివాసుల సంక్షేమం కోసం కృషి చేస్తారనే నమ్మకం లేకపోవడo.  అందుకే షెడ్యూల్డ్ ప్రాంతంలోని టీచర్ల పోస్టులకు స్థానిక షెడ్యూల్డ్ తెగల వారికే నూరు శాతం రిజర్వేషన్ కల్పించారు.  ఆదివాసీయేతర అభ్యర్థులు ఈ రేజర్వేషన్లను రాష్ట్ర అడ్మిన్సిట్రేటివ్ ట్రిబ్యునల్ నుండి సుప్రీం కోర్టు వరకు ఎప్పటికప్పుడు సవాలు చేస్తూ పోయారు.  ఆఖరకు, 15 ఏళ్ల తరువాత 2001 నవంబరులో ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఫుల్ బెంచ్ ఈ రిజర్వేషన్ సబబేనని తీర్పు వెల్లడించి ఈ వివాదానికి తెరదించింది.  ఆదివాసులకు ఏంతో మేలు చేసే ఈ తీర్పు వెనక హక్కుల ఉద్యమకారుడు, న్యాయవాది  బాలగోపాల్ గారి కృషి మరువ లేనిది.

      రెండు దశాబ్దల తరువాత ఇప్పుడు ఈ ఐదుగురు న్యాయమూర్తులు గల సుప్రీం కోర్టు ధర్మాసనం సుప్రీం కోర్టు 1992లో ఇచ్చిన  ఇందిరా సహానీ తీర్పు (మండల్ కేసు) ప్రకారం రేజర్వేషన్లు 50% మించకూడదని, 100% రేజర్వేషన్లు అమలు చేయడం ఇందిరా సహానీ తీర్పుకి విరుద్ధమని అంటోంది.  ఈ నిర్ధారణ సరైనది కాదని మేము ఎందుకు అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 2000 నాటి జి.ఓ. 3 కింద ప్రవేశపెట్టిన రిజర్వేషన్ 16(4) అధికరణం పరిధిలోకి రాదు.  ఇది ఆదేశిక సూత్రమైన 46 అధికరణాన్ని అమలు పర్చడానికి తీసుకు వచ్చినది కాబట్టి అది 16(1) అధికరణం పరిధిలోకి వస్తుంది.  ఇది సామాజిక వెనుకుబాటు తనాన్ని ఉద్దేశించి తీసుకు వచ్చిన రిజర్వేషన్ కాదు కాబట్టి దానికి ఇందిరా సహానీ తీర్పు కానీ బాలాజీ తీర్పు కానీ,  ఆ తీర్పులలోని 50% పరిమితి కానీ వర్తించవు.
       
    ప్రాధమిక హక్కులు మాత్రమే కాదు రాజ్యాంగంలోని పదవ భాగం, ఐదవ షెడ్యూలు రాజ్యాంగ మౌలిక అంశాలలో  (బేసిక్ స్ట్రక్చర్) భాగమే.  బేసిక్ స్ట్రక్చర్ లో భాగమైన సమానత్వ హక్కు 5వ షెడ్యూల్ లో ఇమిడివుంది. షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి, సంక్షేమ సాధన కోసం రాజ్యాంగ నిర్మాతలు ఈ ప్రాంతంలో పరిపాలన ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా, వినూత్న పద్ధతిలో జరగాల్సిన అవసరం ఉందని భావించారు.  అందుకే ఈ ప్రాంత పరిపాలనా బాధ్యతలు రాష్ట్ర గవర్నర్లకు అప్పగించారు.

  సాధారణ ప్రజలందరికీ వర్తించే చట్టాలనే ఆదివాసులకు వర్తింపచేస్తే వారికి తీరని అన్యాయం జరుగుతుందనే స్పృహ రాజ్యాంగకర్తలకు ఉండబట్టే వారు రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ చేర్చారు.  అక్కడ అందరికీ వర్తించే సాధారణ చట్టాలు, సాధారణ ప్రభుత్వ విధానాలు  అమలు చేస్తే ఆదివాసులకు తీరని అన్యాయం చేసిన వారిమీ అవుతామని, వారిపై ఆదివాసీయేతరుల దోపిడీ కొనసాగుతుందని ఈ ప్రయత్నం చేశారు.  వారి ప్రత్యేక సమస్యలను గుర్తించే రాష్ట్ర గవర్నర్లకు షెడ్యూల్డ్ ప్రాంతాలుగా నోటిఫై అయిన చోట్ల వారికి శాసనాలు చేసే, ఉన్న శాసనాలను సవరించే అధికారాన్ని ఇచ్చారు.  అందుకనే అంటున్నాము జి.ఓ. 3 జారీ చేయడానికి రాష్ట్ర గవర్నర్ కి సర్వ అధికారాలు ఉన్నాయని. గవర్నర్లు తమ అధికారాలు దుర్వినియోగం చేసుకోకుండా ఉండటం కోసం 5 షెడ్యూల్ ప్రాంతంలో తీసుకునే చర్యలపై రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉండాలనే నియమం పెట్టారు.  రాష్ట్రపతి గవర్నర్ చర్యలను సమీక్షిస్తారు కాబట్టి గవర్నర్ అధికారంపై ఒక చెక్ ఉంటుంది.  ఆదివాసుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశ్యంతో 5వ షెడ్యూల్ లో ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని సుప్రీo కోర్టు న్యాయమూర్తులు ఈ కేసులో అర్ధం చేసుకోలేకపోయారు.

ఈ తీర్పు చదివిన తరువాత రాబోయే కాలంలో ఏం జరగనుందా అనే ఆందోళన కలగకమానదు.  ఆదివాసీల భూములను ఆదివాసీయేతరుల కబ్జా నుండి కాపాడే 1/70 చట్టం ఎందుకు ఎత్తయకూడదనే వాదనలకు ప్రభుత్వాలు, కోర్టులు వత్తాసు పలుకుతాయా?  లేదంటే కనీస ప్రాతినిధ్యం పేరిట మాత్రం రేజర్వేషన్లు ఎందుకు అమలు చేయాలంటారా?  జి.ఒ. 3 కల్పించిన ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ "ఇది హేతువుకి లొంగని చర్య.  ఎంత ఏకపక్షంగా తీసుకున్న చర్యో? సంపూర్ణ రిజర్వేషన్ అమలు చేసే పేరిట ప్రతిభను కాదనలేము." వంటి వ్యాఖ్యానాలు చదివితే ఈ అనుమానాలు కలగక మానదు.

    "ఆదివాసులకు ఆదివాసులే పాఠాలు చెప్పడం ఏమిటి?"  అని ఈ న్యాయమూర్తులకు "విడ్డురం" అనిపించింది.  ఇది విడ్డురం ఎందుకు అనిపించాలి?  ఆదివాసీ ప్రజలను అందరితో కలిపి చూడకూడదని,  వారికి కొన్ని ప్రత్యేక  సదుపాయాలు కల్పించాలని రాజ్యాంగకర్తలే గుర్తించారు.  ఆదివాసీ టీచర్లు ఆదివాసీ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి మెలిసి అవసరమైతే అదే గ్రామంలో ఉండిపోతూ, వారికి అర్ధమయ్యే రీతిలో, అర్ధమయ్యే భాషలో పాఠాలు చెబుతూ వస్తున్నారు.  ఇది నడుస్తున్న చరిత్ర.  ఆదివాసీ టీచర్ల పని తీరు సమీక్షించే ప్రయత్నం చేయకుండా ఈ జి.ఓ. ప్రతిభని దెబ్బతీస్తుందని అనడం ఇన్ని దశాబ్దాలుగా ఏంతో శ్రద్ధ తీసుకుని పాఠాలు చెబుతున్న ఆదివాసీ టీచర్ల కృషిని సుప్రీం కోర్టు గుర్తించనట్లే.

    మనం అత్యంత అప్రజాస్వామిక రాజకీయ పాలన సాగుతున్న కాలంలో బ్రతుకుతున్నాము.  రాజ్యాంగ విలువలను ధ్వoసంచేస్తూ సమానత్వ హక్కును తుంగలోకి తొక్కుతూ వస్తున్నా తీర్పులు వారికి జతవుతున్నాయి.  అత్యున్నత న్యాయస్థానం ఒక దాని తరువాత మరొకటి సమానత్వహక్కుకి విఘాతం కలిగించే తీర్పులు ఇస్తూ పోతున్నది.  గత ఏడాది ఫిబ్రవరిలో అటవీ హక్కులు నిరూపించుకోలేని కొన్ని లక్షల మంది ఆదివాసులను, ఇతర అటవీవాసులను అడవి నుంచి తరిమేయాలని  తీర్పు ఇచ్చింది.  మరోసారి ఎస్.సి&ఎస్.టి.  అత్యాచార నిరోధక చట్టం, 1989 దుర్వినియోగం అవుతున్నదని తీర్పు ఇచ్చింది.  498ఏ దుర్వినియోగం అవుతోందని వాపోయింది.  సమానత్వ హక్కుపై వారికి కనీస అవగాహన కొరవడిందా అనే అనుమానం కలుగక మానదు.

   రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని పునః సమీక్షించుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషను  దాఖలు చేయాల్సిందిగా హెచ్.ఆర్.ఎఫ్.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను కోరుతోంది.*  ఈ తీర్పుని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని,  ఆదివాసుల హక్కల పరిరక్షణ కోసం ఈ తీర్పుకి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు,   ప్రజా ఉద్యమాలు నిరసన కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరుతున్నాము. 
వి.ఎస్. కృష్ణ, ఎస్. జీవన్ కుమార్
హెచ్.ఆర్.ఎఫ్. ఏ.పి., టి.ఎస్. సమన్వయ కమిటీ సభ్యులు.

Friday, April 24, 2020

జి.వో. నం.3 అనేది ఏజెన్సీ ఏరియాకు గుండె లాంటిది |Gondwana Channel|

ఆదివాసీ సమాజానికి విజ్ఞప్తి
     G.O. No.3 అనేది ఏజెన్సీ  ఏరియా కు గుండె లాంటిది అలాంటి రక్షణ కవచం లా ఉన్న ఐదవ షెడ్యూల్ ప్రాంతం లో గిరణేతరులకు 50% ఉద్యోగాలు ఇవ్వాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వలన ఆదివాసీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేస్తే.....................!
         
1.1/70 చట్టం ఉండదు.
2.ఇప్పుడు ఉన్న go లు కనుమరుగు అవుతాయి.
3.ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరుల జనాభా పెరుగుతుంది.
4.ఇప్పుడు ఉన్న రాజకీయ పదవులు MP. MLA. ZPTC. MPP. సర్పంచ్ మొదలగు పదవులు గిరిజనేతరులే ఉంటారు.
5.వ్యాపారం చేసేవాడు గిరిజనేతరుడె ఉంటారు.
6.ఇప్పుడు  Intigrated Trible Development Agency (ITDA) బోర్డు ఉండదు Non trible development agency బోర్డు ఉంటది.
7.ఆదివాసీ ప్రాంతం లో ఉన్న మండలాలను గిరిజనేతర బడా నాయకులు పంచుకుంటారు అంటే ఇక్కడ నిజాం పరిపాలన వస్తుంది.
          ఇలా  ఊహించుకుంటూ పొతే మన భవిష్యత్తు తరాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.
  మనం చేయవలసిన కర్తవ్యం
          @@@
1, ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులను ఏకతాటిపై తీసుకురావడం.
2.ఆదివాసీ సమాజం లో ప్రస్తుతం వివిధ శాఖలో ఉద్యోగం చేస్తున్న వారిని ఏకతాటిపై తీసుకోని రావడం.
3.ఆదివాసీ నిరుద్యోగు లను ఏకతాటిపై తీసుకురావడం.
4.రీటెడ్ ఉద్యోగస్తులను ఏకం చేసి వారి సలహాలు పరిగణలో తీసుకోవడం.
5.సుప్రీంకోర్టు తీర్పు పరిశీలించి వివిధ రాష్టాలలో ఉన్న ఏజెన్సీ ఏరియాలో ఉద్యోగ నియామకాలు ఎలా ఉన్నాయో పరిశీలించుటకు కమిటీ వేయుట.
6.రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులు ద్వారా go 3 ని కాపాడానికి ఒత్తిడి తీసుకోని వచ్చేటట్టు ప్రయత్నం చేపియడం
       ఇలా  చెయ్యి చెయ్యి కలిపి ఐక్యమత్యంతో  సామాజాన్ని కాపుడుకుందాము అని ఇందులో ఏమైనా తప్పులు ఉంటె క్షమించగలరని నా మనవి
           ఇట్లు
శ్రీ మెస్రం గంగారాం ఆదివాసీ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి (ATA) cell 9490005494.


Monday, April 20, 2020

ఇంద్రవెళ్లి అమరుల యాధిలో గోండుల పోరాట చరిత్రలో ఆరని గాయం ఇంద్రవెళ్లి ఘటనకు 39ఏళ్లు |Gondwana Channel|

ఇంద్రవెళ్లి అమరుల యాధిలో
గోండుల పోరాట చరిత్రలో ఆరని గాయం ఇంద్రవెళ్లి ఘటనకు 39ఏళ్లు

ఇంద్రవెల్లిలో  ఆదివాసీల అమరత్వాన్ని కి 39 ఏళ్ళు భూమి హక్కులకై తిరగబడి రక్తం చిందించిన భూమి పై ఆదివాసిలకు పూర్తి హక్కు  కల్పించాలని గోంతెత్తి గర్జించిన ఆదివాసులు
  అప్పటి కాంగ్రెస్ పార్టీ పాలక ప్రభుత్వంపై  ఆదివాసులు భూమి పై హక్కుకావలని ఇంద్రవెల్లి లో అకలి పేగులతో ,పిల్ల పాపలతో చావుడో  సచ్చుడో తెల్చుకుందామని మా భూములకు మాకే పూర్తి హక్కులు  దక్కలని పిడికిలెత్తి,నడుంకట్టి ,పౌరుషంతో ఆదివాసులు ఇంద్రవెళ్లికి వేలదిగా దండుల కదాలి  వచ్చారు.ఒకే మాట ఒకే బాట ఒకే  నినాదంతో జంగుసైరంవలే   కదిలారు అందరు  పిడికిలేత్తి,వేలది కొంతుకులై గర్జించారు తమ అస్త్రలను సంధించి..పోరాటని కోనసాగీంచారు
 20 ఏప్రిల్1981న నాటి కాంగ్రెస్ ప్రభుత్వని ఆదివాసిలు ప్రశ్నించినందుకు? గాను నాటి పోలిసువారిచే కాంగ్రెస్ పాలకులు అమాయక ఆదివాసులపై విచక్షణ రహితంగా,అతి కర్కసత్వంగా కనీకరం లేకుండ కాల్పులు జరిపారు.భయ బ్రంతులకు గురై చెట్టుకు ఒక్కరు,గుట్టకు ఒక్కరు పరుగులు పెట్టిన ఆదివాసులను వెంటడి వేటడి అతి పాసవికంగా చంపివేశారు.నాడు ప్రజాస్వామ్యాని కుని చేశారు
  ఏదిఏమైన ఇంద్రవెళ్లి  అమరుల ఆశయాలను సాధించడానీకి పోరాటమే శారణ్యం అన్యాయం జరిగిన చోట ప్రశ్నించకుంటే సమస్యకు పరిష్కరము దోరకాదు అందుకే జాతి  హక్కుల సాధనకోసం ఇంద్రవెళ్లి అమరుల స్పూర్తితో పోరాటలతో ముందుకు కదులుద్దాం..మన అమరుల ఆశయాలను సాద్దించుకుందాం..
సాధ్దించుకుందాం ...
ఇంద్రవెళ్లి అమర  వీరులకు  జోహర్ జోహర్
(వాట్సాప్ ద్వారా వచ్చిన సందేశం)


Monday, April 6, 2020

తుడుందెబ్బ వ్యవస్థాపకుడు కీ.శే. సిడాం శంభు గారి 50వ జయంతి |Gondwana Channel|

తుడుందెబ్బ వ్యవస్థాపకుడు ఈ తరానికి  మొదటి ఉద్యమ వీరుడు  ఆదివాసుల పక్షనా నిరంతరం  గ ఆదివాసుల హక్కుల కోసం కొమురం భీం నినాదాన్ని  బుజాలలో  మోసి జల్  జగల్ జమీన్ కొరకు దేశ నలుమూల ఆదివాసీలను  ఏకం  చేసి అటవీ హక్కుల చటం లో తనదైనశైలిలో  దేశ  రాజధానిలో వెళ్లి అటవీ  హక్కుల చటం లో సభ్యులు గా బాధ్యత తీసుకొని ఆదివాసులకు అటవీ పై హక్కు  కల్పించిన ఘనత  కూడా ఈయనకే  సొంతం ఆదివాసీల చట్టలను అధికారులు అములు చేయడంలో  విఫలం  అయ్యారు అని తనదైన శైలిలో ఆదివాసీ చట్టాలను అములు చేసి చట్టాలను ఈ తరం నాయకులకు ,యువకులకు పరిచయం చేసి అవగాహన కలిపించారు  ఆదివాసుల   సమస్యల పై  ఆదివాసీ సంప్రదాయలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా అప్పటి దేశ  ప్రధాని ఇందిరా గాంధీ గారు కి, పరిచయం చేసిన గొప్ప మనసున్న నాయకుడు కీర్తీ శే,,సిడాం.శంభు గారి ,50వ జయంతి శభాకాంక్షలు..!
ఆదివాసి హక్కులు,చట్టాల సాధనకై,అమలు కోసం నిరంతర పొరటం చేసి గూడా గూడా ను చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం లో చురుకైన పాత్రా పోషించి ఏజెన్సీ ప్రాంతం ను కలుపుకొని ఐటీడీఏ కేంద్రాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు నిరాహార దీక్ష చేసి అనతి కాలం లో మా నుంచి దూరమైన ఆదివాసీ ఏజెన్సీ కొదుమా సింహం నా ఆదివాసీ ఉద్యమ గురువు కీ.శే.సిడం శంభు గారికి 50 వ జయంతి శుభాకాంశాలు...తెలియచేస్తూ నువ్వు ఎక్కడ ఉన్న ని  ఆత్మ శాంతిగా ఉండాలని జంగుబాయి దేవుని కోరుతున్నాను, నీ శిష్యులుగా ని ఆశయం కోసంనిరంతర పొరటం కొనసాగిస్తూనే ఉంటమి తెలియచేస్తూ ..మీ శిష్యుడు వెడ్మ బొజ్జు పటేల్ రాజ్ గోండ్..!

Sunday, April 5, 2020

విత్తనం పండుగ (Seed festival) |Gondwana Channel|

కొలుకి కొత్త గుడ్డ కడితే విప్పపూలు కింద పడకుండా అందులో పడుతాయి..అప్పుడు వాటిని ఎండ బెట్టి  జూన్ లేదా జులై నెలలో విత్తనం పండుగ (Seed festival) గ్రామదేవత అయిన ముత్యాలమ్మ దగ్గర చేస్తారు.అప్ప్పుడు నిండు చెంబులో నీళ్ల పెట్టి పూజారి వెనక్కు తిరిగి కూర్చొని ఒక్కొక్క కార్తె చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు నీళ్లలో వేస్తారు..ఏ పువ్వు అయితే నీళ్లలో మునుగుతదో ఆ కార్తెలో  మంచిగ వర్షం పడుద్ది.లేకపోతే వాన పడదు..మన పూర్వీకులు ఈ పద్దతి ద్వారనే కాలాన్ని లెక్కించి ,ఏ కార్తెలో ఏ పంటలు వేయాలో దాన్ని బట్టి నిర్ణయించుకునేవారు.ఈ పద్ధతిలోనే ఆదివాసీలు కాలాన్ని లెక్కించేవారు...!



Gondwana Kabur